ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదనే స్టేట్ మెంట్ కనక నిజమైతే ఏడాదిన్నర ముందు నుంచే రాజమౌళి – మహేష్ బాబు వారణాసికి ఇంత పబ్లిసిటీ ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవాలి. ఐపిఎల్ సీజన్ లో కొన్ని సెకండ్ల టీవీ యాడ్ కోసం కోట్లు ఖర్చు పెట్టే కంపెనీలు ఎన్నో. సో సరుకులో ఎంత నాణ్యత ఉన్నా అది జనాలకు తెలియాలంటే ప్రమోషన్లు చాలా కీలకం.
ఇటీవలే బ్లాస్ట్ జోన్ విడుదలయ్యింది. అర్జున్ హీరోగా అభిరామి, ప్రీతీ ముకుందన్ ఆయన భార్యా కూతురిగా నటించారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ బోలెడంత క్రైమ్ ప్లస్ థ్రిల్స్ ఉన్నాయి. టాక్ బాగుంది. తమిళంలో కరుప్పుని తట్టుకుని వసూళ్లు రాబడుతోంది. తెలుగులో కూడా డీసెంట్ రెవిన్యూ ఉంది కానీ టాక్ కు తగ్గట్టు లేకపోవడం ట్రాజెడీ. ఒకవేళ సరైన రీతిలో దీన్ని రిజిస్టర్ చేసుంటే వీకెండ్ తో పాటు పెద్ది వచ్చే దాకా వసూళ్లకు ఛాన్స్ ఉండేది.
ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. ఒక ప్రెస్ మీట్ తప్ప బ్లాస్ట్ జోన్ కు జరిగిన ప్రమోషన్ సున్నా. అర్జున్ తో సహా టీమ్ మొత్తం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా వాడుకోలేదు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ ఎక్కడా దీని గురించి పెద్దగా సౌండ్ లేదు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసిన నాగవంశీ ఈ విషయం మీద కొంచెం ఫోకస్ పెట్టుంటే కలెక్షన్లు మెరుగయ్యేవి. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. టాక్ ఏదో ఒక రూపంలో తెలుసుకున్న కాసిన్ని ఆడియన్స్ థియేటర్లకు వెళ్లారు.
టైటిల్ మరో మైనస్ గా నిలిచింది. ఏదో హాలీవుడ్ డబ్బింగ్ తరహాలో బ్లాస్ట్ జోన్ అని పెట్టడం మాస్ వర్గాలకు కనెక్ట్ కాలేదు. నోరు తిరగని ఇలాంటి ఇంగ్లీష్ పేర్లు చేసే చేటు ఎక్కువగా ఉంటుంది. ఊపులో ఉన్న స్టార్ హీరోకు పెడితే ఓకే. కానీ అర్జున్ ఆ క్యాటగిరీ కాదు. అలాంటపుడు ఈజీగా రీచ్ అయ్యే టైటిల్ ఎంచుకోవాలి. ఇలా ఒకపక్క జీరో ప్రమోషన్లు, ఇంకోవైపు నెగటివ్ టైటిల్ రెండు కలిసి మంచి టాక్ వచ్చిన సినిమాని దాని పొటెన్షియాలిటీ వాడకుండా అడ్డం పడ్డాయనేది వాస్తవం.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…