మారుతి అంత పెద్ద విజయం అందించినా కానీ అందరు ప్రముఖ హీరోలు ఏదో ఒక సినిమాతో బిజీగా వుండడంతో ఇంకా అతని మలి చిత్రానికి హీరో సెట్ కాలేదు. దీంతో ఈలోగా మారుతి తన ప్రొడక్షన్ హౌస్ని మళ్లీ స్టార్ట్ చేసి ఓటిటిల కోసం సినిమాలు నిర్మించే ఆలోచనలో వున్నాడు. సోలో ప్రొడక్షన్ కాకుండా ఇతర ప్రొడ్యూసర్లతో కలిసి మారుతి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలావుంటే మారుతి మలి చిత్రానికి నిర్మాత ఖరారైపోయినట్టే. యువి క్రియేషన్స్ లో మారుతి మలి చిత్రం వుంటుంది.
ఇప్పటికే రాతపూర్వక ఒప్పందాలు జరిగిపోయాయి. మారుతి దగ్గర కథ కూడా రెడీ అయిపోయింది. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫిక్స్ కావాల్సి వుంది. మారుతి దృష్టిలో రవితేజతో చేయాలని వుందట. రవితేజ ఫ్రీగా వుంటే అతనితో లేదంటే మరెవరైనా యువ హీరోతో చేస్తారట. రామ్కి మారుతి వినిపించిన కథ కోసమే ఇప్పుడు రవితేజను కన్సిడర్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే రవితేజకి ప్లస్ అవుతుంది.
వరుస పరాజయాలతో మార్కెట్ పూర్తిగా కోల్పోయిన రవితేజ ‘క్రాక్’తో బ్రేక్ వస్తుందని చూస్తున్నాడు. మారుతితో ఫాలో అప్ సినిమా పడితే మరో మినిమం గ్యారెంటీ మూవీ ఖాయం చేసుకోవచ్చు.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…