Movie News

అగ్రిమెంట్‍ టైమ్‍ కంటే ముందే గంగవ్వ ఎగ్జిట్‍?

ఓటింగ్‍ ద్వారా గంగవ్వ ఎలిమినేషన్‍ జరగడం ఇంపాజిబుల్‍ అనేది ఇప్పటికే స్పష్టమైపోయింది. ఆమెకు సింపతీ కొద్దీ జనం ఓట్లు గుద్దేస్తున్నారు కనుక ఆమె రెగ్యులర్‍ పద్ధతిలో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఈ సంగతి బిగ్‍బాస్‍ నిర్వాహకులకు కూడా తెలుసు. మరి ఆమె పదిహేను వారాల పాటు హౌస్‍లో వుండి విజేతగా బయటకు వస్తుందా? పల్లెటూర్లో ఆరు బయట తిరుగుతూ, పొలం పనులు చేసుకుంటూ కాలక్షేపం చేసే వృద్ధురాలికి అలా ఒకే ఇంట్లో అపరిచితులతో అన్ని రోజులుండడం జరిగే పని కాదు.

అందుకే బిగ్‍బాస్‍ నిర్వాహకులు ఆమెను అయిదు వారాల పాటు వుండాలని చెప్పారట. కానీ మొదటి వారానికే అవ్వకు ఇంటిపై గుబులు మళ్లింది. ఇప్పటికే అక్కడ అన్యమనస్కంగా వుంటూ నాగార్జునతోనే రెండుసార్లు బయటకు పంపుర్రి అంటూ అర్జీ పెట్టుకుంది. సూర్యకిరణ్‍ వెళ్లిపోతుంటే కూడా తనను పంపేసి అతడిని వుంచమని చెప్పింది. అగ్రిమెంట్‍ ప్రకారం అయిదు వారాల పాటు గంగవ్వ అక్కడ వుంటుందా అనేది అనుమానమే.

మూడవ వారంలో ఆమె స్వచ్ఛందంగా బయటకు వచ్చే అవకాశముందని వినిపిస్తోంది. ఇదిలావుంటే గంగవ్వను బిగ్‍బాస్‍ రెగ్యులర్‍ కంటెస్టెంట్‍గా లెక్కించలేదు. అందుకే మొదటి వారంలోనే ఎక్స్ ట్రా ప్లేయర్‍ను లోపలకు పంపించారు. గంగవ్వ బయటకు వచ్చిన వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుందని సమాచారం.

This post was last modified on September 16, 2020 2:22 am

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

9 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

13 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago