తమిళ కథానాయకుడు సిద్ధార్థ్, హైదరాబాద్ మూలాలున్న బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. ‘వంశీ’ అనే డిజాస్టర్ మూవీ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్లను ఒక్కటి చేసినట్లే ‘మహాసముద్రం’ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ ఈ జంట ప్రేమకు బీజం వేసింది. ముందు వీళ్లిద్దరూ జస్ట్ స్నేహితులే అనుకున్నారు.
కానీ తర్వాత కూడా తరచూ కలవడం, మీడియా కంట్లో పడడంతో వ్యవహారం వేరని అర్థమైంది. ఏడాది కిందట్నుంచే ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరి ఫొటోలు ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైందట. వీరి వివాహానికి తెలుగు గడ్డ వేదికైనట్లుగా వార్తలు వస్తుండడం విశేషం.
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో వీళ్లిద్దరూ ఏ హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఏ ఆడంబరం లేకుండా సింపుల్గా పెళ్లి జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత నివాసమైన చెన్నై కాకుండా తెలంగాణకు వచ్చి ఈ జంట పెళ్లి చేసుకోవడం విశేషమే.
సిద్ధుకు చాలా ఏళ్ల కిందటే పెళ్లయింది. తర్వాత అతను విడాకులు తీసుకున్నాడు. కొంత కాలం సమంతతో రిలేషన్షిప్లో ఉన్నాడు. తర్వాత ఒంటరిగానే చాలా ఏళ్లు గడిపాడు. అదితికి కూడా గతంతోనే పెళ్లయింది. ఆమె కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడీ జంట కొత్త ప్రయాణానికి సిద్ధమైంది. మరి ఈ పెళ్లి వార్త నిజమే అయితే.. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని ఆశిద్దాం.
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…