Movie News

నిజమా.. సిద్ధు పెళ్లయిపోయిందా?

త‌మిళ క‌థానాయ‌కుడు సిద్ధార్థ్, హైద‌రాబాద్ మూలాలున్న బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైద‌రీ కొన్నేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘వంశీ’ అనే డిజాస్టర్ మూవీ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌లను ఒక్కటి చేసినట్లే ‘మహాసముద్రం’ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ ఈ జంట ప్రేమకు బీజం వేసింది. ముందు వీళ్లిద్దరూ జస్ట్ స్నేహితులే అనుకున్నారు.

కానీ తర్వాత కూడా తరచూ కలవడం, మీడియా కంట్లో పడడంతో వ్యవహారం వేరని అర్థమైంది. ఏడాది కిందట్నుంచే ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరి ఫొటోలు ఎప్పుడు సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చినా వైర‌ల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైందట. వీరి వివాహానికి తెలుగు గడ్డ వేదికైనట్లుగా వార్తలు వస్తుండడం విశేషం.

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో వీళ్లిద్దరూ ఏ హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఏ ఆడంబరం లేకుండా సింపుల్‌గా పెళ్లి జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత నివాసమైన చెన్నై కాకుండా తెలంగాణకు వచ్చి ఈ జంట పెళ్లి చేసుకోవడం విశేషమే.

సిద్ధుకు చాలా ఏళ్ల కిందటే పెళ్లయింది. తర్వాత అతను విడాకులు తీసుకున్నాడు. కొంత కాలం సమంతతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తర్వాత ఒంటరిగానే చాలా ఏళ్లు గడిపాడు. అదితికి కూడా గతంతోనే పెళ్లయింది. ఆమె కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడీ జంట కొత్త ప్రయాణానికి సిద్ధమైంది. మరి ఈ పెళ్లి వార్త నిజమే అయితే.. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని ఆశిద్దాం.

This post was last modified on March 27, 2024 11:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

35 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago