తీవ్ర వివాదాస్పదమైన విజయవాడ వెస్ట్ సీటును ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. బీజేపీ తన పంతమే నెగ్గించుకుంది. ఈ సీటును జనసేనకు కేటాయిస్తామని ముందు చెప్పిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి ఇచ్చేశారు. దీంతో ఈ సీటును ప్రముఖ పారిశ్రామిక వేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కేటాయించారు. కానీ, ఇక్కడ జనసేన అభ్యర్థిగా బరిలో దిగాల్సిన పోతిన మహేష్ ఇప్పటికీ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక, బీజేపీ తాజాగా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సీనియర్లలో చాలా తక్కువ మందికే అవకాశం లభించింది.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఆపార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కూటమిలో బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. మరో సీటు కోసం చర్చలు జరుగుతున్నాయి. దీనిని జనసేన ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలిసింది. ఇక, గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులపై కసరత్తు చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
ఇదీ.. 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల బీజేపీ జాబితా
ధర్మవరం- సత్యకుమార్
ఎచ్చెర్ల – ఈశ్వరరావు
విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు
అనపర్తి- శివకృష్ణరాజు
విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి(టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు)
కైకలూరు – కామినేని శ్రీనివాస్
బద్వేల్ – బొజ్జా రోశన్న(ఎస్సీ)
జమ్మలమడుగు: ఆదినారాయణరెడ్డి(టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు)
ఆదోని – పార్థసారథి
అరకు వ్యాలీ – రాజారావు(ఎస్టీ)
కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్…
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…