తీవ్ర వివాదాస్పదమైన విజయవాడ వెస్ట్ సీటును ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. బీజేపీ తన పంతమే నెగ్గించుకుంది. ఈ సీటును జనసేనకు కేటాయిస్తామని ముందు చెప్పిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి ఇచ్చేశారు. దీంతో ఈ సీటును ప్రముఖ పారిశ్రామిక వేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కేటాయించారు. కానీ, ఇక్కడ జనసేన అభ్యర్థిగా బరిలో దిగాల్సిన పోతిన మహేష్ ఇప్పటికీ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక, బీజేపీ తాజాగా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సీనియర్లలో చాలా తక్కువ మందికే అవకాశం లభించింది.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఆపార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కూటమిలో బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. మరో సీటు కోసం చర్చలు జరుగుతున్నాయి. దీనిని జనసేన ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలిసింది. ఇక, గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులపై కసరత్తు చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
ఇదీ.. 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల బీజేపీ జాబితా
ధర్మవరం- సత్యకుమార్
ఎచ్చెర్ల – ఈశ్వరరావు
విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు
అనపర్తి- శివకృష్ణరాజు
విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి(టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు)
కైకలూరు – కామినేని శ్రీనివాస్
బద్వేల్ – బొజ్జా రోశన్న(ఎస్సీ)
జమ్మలమడుగు: ఆదినారాయణరెడ్డి(టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు)
ఆదోని – పార్థసారథి
అరకు వ్యాలీ – రాజారావు(ఎస్టీ)
This post was last modified on March 27, 2024 11:34 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…