కొందరు నటులు తెర మీద కంటే బయట జనాల దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తుంటారు. వాళ్ల చేష్టలు, మాటలు అన్నీ కూడా చర్చనీయాంశం అవుతుంటాయి. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ కోవకే చెందుతాడు. మలయాళంలో విలక్షణ పాత్రలతో అతను మంచి గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా షైన్ చేసిన నెగెటివ్ క్యారెక్టర్లు ఆయా సినిమాలకు పెద్ద ప్లస్ అయ్యాయి. తన క్యారెక్టర్లు అదో టైపులో ఉంటాయి. బయట కూడా అతను కొంచెం భిన్నంగానే ప్రవర్తిస్తుంటాడు.
‘దసరా’, ‘రంగబలి’ లాంటి చిత్రాలతో షైన్ తెలుగులో కూడా మంచి గుర్తింపే సంపాదించాడు. తన పాత్రలను మించి.. బయట ఇంటర్వ్యూల్లో అతడి చేష్టలు చర్చనీయాంశం అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ షర్ట్ బాగుందంటే అప్పటికప్పుడు విప్పి ఇచ్చేయడానికి చూడటం లాంటి చర్యలు చూసి జనాలు షాకయ్యారు. ఈ క్రమంలోనే బయట షైన్ డిఫరెంట్గా బిహేవ్ చేసిన వీడియోలు చాలా వెలుగులోకి వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐతే ఇప్పుడు షైన్ తెలుగులో ఒప్పుకున్న కొత్త చిత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. నందమూరి బాలకృష్ణతో షైన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో షైన్ నటిస్తున్నాడట. బాలయ్య కూడా బయట కొంచెం డిఫరెంట్గానే బిహేవ్ చేస్తుంటాడు. ఆయనది టిపికల్ క్యారెక్టర్ అన్న సంగతి తెలిసిందే. కోపం వస్తే అభిమానుల మీద చేయి చేసుకోవడం.. ఫోన్లు విసిరేయడం లాంటి ఆయన చర్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే.
ఈ నేపథ్యంలో భిన్నమైన వ్యక్తిత్వాలున్న ఇద్దరు నటులు ఒక సినిమా కోసం కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఇప్పుడు మీమ్స్ రెడీ చేసి వదులుతున్నారు నెటిజన్లు. అవి చాలా ఫన్నీగా ఉన్నాయి. వీళ్లిద్దరినీ తెర మీద చూడటం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని.. బాబీ భలే కాంబినేషన్ సెట్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on March 13, 2024 5:23 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…