రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిందే. కథ తయారీకే ఆయనకు సంవత్సరం తక్కువ కాకుండా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రి ప్రొడక్షన్ పనులకు ఆర్నెల్ల నుంచి సంవత్సరం దాకా వెచ్చిస్తారు. ఇక మేకింగ్కు కనీసం రెండేళ్లు పడుతుంది. అలా ఒక్కో సినిమాకు మినిమం నాలుగేళ్లు టైం పెడుతున్నాడు జక్కన్న. ఐతే ఔట్ పుట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత కాలమైనా వెచ్చిస్తారు. ప్రేక్షకులు కూడా ఎంత సమయమైనా ఎదురు చూస్తారు.
ఒక్క మర్యాద రామన్నను పక్కన పెడితే ‘మగధీర’ నుంచి జక్కన్న సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి. రాజమౌళి సినిమాలకు ముందు ఒక రిలీజ్ డేట్ ఇవ్వడం.. తర్వాత మార్చడం అన్నది చాలా కామన్ అయిపోయింది. రాజమౌళిని కొనియాడుతూనే.. ఆయన సినిమాలకు ఏళ్లకు ఏళ్లు సమయం పట్టడం.. ఆయన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడటం గురించి సోషల్ మీడియాలో సరదాగానే పంచులు వేస్తుంటారు జనాలు.
ఐతే ఇప్పుడు రాజమౌళే స్వయంగా తన మీద తాను పంచ్ వేసుకున్నాడు. తన కొడుకు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ సినిమాకు మంచి ఫలితం దక్కిన నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో జక్కన్న పాల్గొన్నాడు. యంగ్ టీంను కొనియాడుతూ ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎంత వేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి చకచకా రిలీజ్ చేశామో వివరించాడు.
అతను మాట్లాడుతుండగా.. జక్కన్న కలుగజేసుకుని “రేయ్.. నన్ను వెనకాలే పెట్టుకుని ఫాస్ట్గా చేశాం, వారం రోజుల్లో చేశాం. పంపించాం అని చెప్పకురా” అని అనడంతో కార్తికేయ సహా స్టేజ్ మీద ఉన్న వారంతా ఘొల్లుమన్నారు. రాజమౌళి స్థాయి దర్శకుడు తన మీద ఇలా సెల్ఫ్ ట్రోల్ వేసుకోవడం ఆయన ఎంతటి సరదా మనిషో తెలియజేస్తుంది. ఇక ‘ప్రేమలు’ సినిమాలో మైన్యూట్ డీటైల్స్ ప్రస్తావిస్తూ.. ఈ వేడుకలో టీం సభ్యులను జక్కన్న పొగిడిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.
This post was last modified on March 13, 2024 2:00 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…