రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిందే. కథ తయారీకే ఆయనకు సంవత్సరం తక్కువ కాకుండా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రి ప్రొడక్షన్ పనులకు ఆర్నెల్ల నుంచి సంవత్సరం దాకా వెచ్చిస్తారు. ఇక మేకింగ్కు కనీసం రెండేళ్లు పడుతుంది. అలా ఒక్కో సినిమాకు మినిమం నాలుగేళ్లు టైం పెడుతున్నాడు జక్కన్న. ఐతే ఔట్ పుట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత కాలమైనా వెచ్చిస్తారు. ప్రేక్షకులు కూడా ఎంత సమయమైనా ఎదురు చూస్తారు.
ఒక్క మర్యాద రామన్నను పక్కన పెడితే ‘మగధీర’ నుంచి జక్కన్న సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి. రాజమౌళి సినిమాలకు ముందు ఒక రిలీజ్ డేట్ ఇవ్వడం.. తర్వాత మార్చడం అన్నది చాలా కామన్ అయిపోయింది. రాజమౌళిని కొనియాడుతూనే.. ఆయన సినిమాలకు ఏళ్లకు ఏళ్లు సమయం పట్టడం.. ఆయన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడటం గురించి సోషల్ మీడియాలో సరదాగానే పంచులు వేస్తుంటారు జనాలు.
ఐతే ఇప్పుడు రాజమౌళే స్వయంగా తన మీద తాను పంచ్ వేసుకున్నాడు. తన కొడుకు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ సినిమాకు మంచి ఫలితం దక్కిన నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో జక్కన్న పాల్గొన్నాడు. యంగ్ టీంను కొనియాడుతూ ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎంత వేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి చకచకా రిలీజ్ చేశామో వివరించాడు.
అతను మాట్లాడుతుండగా.. జక్కన్న కలుగజేసుకుని “రేయ్.. నన్ను వెనకాలే పెట్టుకుని ఫాస్ట్గా చేశాం, వారం రోజుల్లో చేశాం. పంపించాం అని చెప్పకురా” అని అనడంతో కార్తికేయ సహా స్టేజ్ మీద ఉన్న వారంతా ఘొల్లుమన్నారు. రాజమౌళి స్థాయి దర్శకుడు తన మీద ఇలా సెల్ఫ్ ట్రోల్ వేసుకోవడం ఆయన ఎంతటి సరదా మనిషో తెలియజేస్తుంది. ఇక ‘ప్రేమలు’ సినిమాలో మైన్యూట్ డీటైల్స్ ప్రస్తావిస్తూ.. ఈ వేడుకలో టీం సభ్యులను జక్కన్న పొగిడిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.
This post was last modified on March 13, 2024 2:00 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…