రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిందే. కథ తయారీకే ఆయనకు సంవత్సరం తక్కువ కాకుండా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రి ప్రొడక్షన్ పనులకు ఆర్నెల్ల నుంచి సంవత్సరం దాకా వెచ్చిస్తారు. ఇక మేకింగ్కు కనీసం రెండేళ్లు పడుతుంది. అలా ఒక్కో సినిమాకు మినిమం నాలుగేళ్లు టైం పెడుతున్నాడు జక్కన్న. ఐతే ఔట్ పుట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత కాలమైనా వెచ్చిస్తారు. ప్రేక్షకులు కూడా ఎంత సమయమైనా ఎదురు చూస్తారు.
ఒక్క మర్యాద రామన్నను పక్కన పెడితే ‘మగధీర’ నుంచి జక్కన్న సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి. రాజమౌళి సినిమాలకు ముందు ఒక రిలీజ్ డేట్ ఇవ్వడం.. తర్వాత మార్చడం అన్నది చాలా కామన్ అయిపోయింది. రాజమౌళిని కొనియాడుతూనే.. ఆయన సినిమాలకు ఏళ్లకు ఏళ్లు సమయం పట్టడం.. ఆయన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడటం గురించి సోషల్ మీడియాలో సరదాగానే పంచులు వేస్తుంటారు జనాలు.
ఐతే ఇప్పుడు రాజమౌళే స్వయంగా తన మీద తాను పంచ్ వేసుకున్నాడు. తన కొడుకు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ సినిమాకు మంచి ఫలితం దక్కిన నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో జక్కన్న పాల్గొన్నాడు. యంగ్ టీంను కొనియాడుతూ ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎంత వేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి చకచకా రిలీజ్ చేశామో వివరించాడు.
అతను మాట్లాడుతుండగా.. జక్కన్న కలుగజేసుకుని “రేయ్.. నన్ను వెనకాలే పెట్టుకుని ఫాస్ట్గా చేశాం, వారం రోజుల్లో చేశాం. పంపించాం అని చెప్పకురా” అని అనడంతో కార్తికేయ సహా స్టేజ్ మీద ఉన్న వారంతా ఘొల్లుమన్నారు. రాజమౌళి స్థాయి దర్శకుడు తన మీద ఇలా సెల్ఫ్ ట్రోల్ వేసుకోవడం ఆయన ఎంతటి సరదా మనిషో తెలియజేస్తుంది. ఇక ‘ప్రేమలు’ సినిమాలో మైన్యూట్ డీటైల్స్ ప్రస్తావిస్తూ.. ఈ వేడుకలో టీం సభ్యులను జక్కన్న పొగిడిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.
This post was last modified on March 13, 2024 2:00 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…