సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అవుట్ రైట్ గా డిజాస్టర్ అయ్యింది సైంధవ్ ఒక్కటే. పాతిక కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేస్తే కేవలం ఎనిమిది కోట్లే రాబట్టిందని ట్రేడ్ టాక్. మూడు నాలుగు రోజులు మినహాయించి దాదాపు అన్ని చోట్ల డెఫిషిట్లకు వెళ్లిపోవడంతో టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ప్రమోషన్లు ఆపేసింది. ఏదైనా పికప్ ఆశించడం కూడా కష్టమే. దర్శకుడు శైలేష్ కొలనుని విపరీతంగా నమ్మిన వెంకటేష్ దానికి తగ్గట్టు కనీసం సగం ఫలితం కూడా అందుకోలేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక్కడ తరుణ్ భాస్కర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
సుమారు రెండేళ్ల క్రితం వెంకటేష్ 75వ సినిమాకు డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందనే చర్చ వచ్చినప్పుడు తరుణ్ భాస్కర్ చెప్పిన లైన్ సురేష్ బాబుకి బాగా నచ్చేసిందట. అయితే సెకండ్ హాఫ్ ని డెవలప్ చేసే క్రమం ఎవరిని సంతృప్తి పరిచేలా రాకపోవడంతో పలు దఫాల డిస్కషన్ల తర్వాత ఆపేశారు. గుర్రపు పందేలు, మాఫియా చుట్టూ ఏదో డిఫరెంట్ గా అనుకున్న పాయింట్ అది. అప్పటికే తరుణ్ టైం ఎక్కువ ఖర్చయిపోవడంతో చేతిలో సిద్ధంగా ఉన్న కీడా కోలాతో ప్రొసీడ్ అవుదామని సురేష్ బాబు చెప్పడంతో తక్కువ బడ్జెట్ తో దాన్ని వీలైనంత వేగంగా దాన్ని తెరకెక్కించారట.
తీరా చూస్తే తరుణ్ భాస్కర్ కి కీడా కోలా గొప్ప పేరేమి తీసుకురాలేదు. వసూళ్లు ఓకే కానీ ఈ నగరానికి ఏమైంది స్థాయిలో లేదనే కామెంట్స్ ఓపెన్ గా వినిపించాయి. ఇటు చూస్తేనేమో సైంధవ్ బోల్తా కొట్టేసింది. ఒకవేళ ఇంకాస్త సీరియస్ గా ముందు అనుకున్న ప్రాజెక్టు మీదే వర్క్ చేసి ఉంటే మంచి సినిమా అయ్యేదేమోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోవాలని కోరుకున్న 75వ సినిమా మరీ ఇంత అన్యాయంగా బాక్సాఫీస్ వద్ద డుంకీ కొట్టడం వాళ్లకు షాకే. రానా నాయుడు సీజన్ 2 కోసం రెడీ అవుతున్న వెంకీ నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది సస్పెన్స్ గానే ఉంది.
This post was last modified on January 24, 2024 7:07 pm
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…