ఒక్క పెద్ద ప్యాన్ ఇండియా సినిమా పూర్తి చేయడానికే స్టార్ హీరోలకు ఏళ్లకేళ్లు పడుతున్న ట్రెండ్ లో బాలీవుడ్ మొత్తానికి రన్బీర్ కపూరే అత్యంత అదృష్టవంతుడని ఎందుకు చెప్పాలో పూర్తి మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. యానిమల్ తో తొమ్మిది వందల కోట్ల బ్లాక్ బస్టర్ ని జేబులో వేసుకున్న రన్బీర్ కి సూపర్ స్టార్ ట్యాగ్ పెట్టారు కానీ నిజంగా దాన్ని సార్ధకం చేసుకునే పనిలో పడ్డాడు. అదెలాగో ప్రాజెక్టు లైనప్ చూసి చెప్పొచ్చు. ముందుగా తను చేయబోయే వాటిలో ‘యానిమల్ పార్క్’ మొదటిది. దాంట్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా చేయబోతున్నాడు. ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
దర్శకుడు నితీష్ తివారి వందల కోట్లతో ప్లాన్ చేసుకున్న ‘రామాయణం’లో రాముడిగా రన్బీర్ కపూరే లాకైన సంగతి తెలిసిందే. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. శతాబ్దాల తరబడి చెప్పుకునేలా తీస్తానని నితీష్ తెగ ఊరిస్తున్నారు. ఇవాళ సంజయ్ లీలా భన్సాలీ కొత్త సినిమా ‘లవ్ అండ్ వార్’ ప్రకటించారు. 2025 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా ‘బ్రహ్మస్త్ర పార్ట్ 2 దేవా’తో పాటు ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 3’ని 2028 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం అయిదు క్రేజీ సినిమాలతో ఇంత భారీ లైనప్ షారుఖ్, సల్మాన్ లు కూడా లేదు.
ఖాన్ల ద్వయం క్రమంగా ముగింపుకోస్తున్న తరుణంలో కొత్త జనరేషన్ కు మొదటి స్టార్ హీరోగా రన్బీర్ కపూర్ నిలుస్తాడని విశ్లేషకులు అంచనాల వేస్తున్నారు. పైన చెప్పిన అయిదు సినిమాల మార్కెట్ విలువ ఎంత లేదన్నా మూడు వేల కోట్ల దాకా ఉంటుంది. థియేటర్ రైట్స్, ఓటిటి, డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ అంతా కలిపి అంతకన్నా ఎక్కువే అయినా ఆశ్చర్యం లేదు. మనకు ప్రభాస్ ఎలాగో నార్త్ జనాలకు రన్బీర్ కపూర్ అవతరిస్తున్నాడు. ఇతర హీరోలు ఈర్ష్య పడేందుకు ఇంతకన్నా కారణం ఏముంటుంది. అన్నట్టు లవ్ అండ్ వార్, బ్రహ్మాస్త్ర 2-3లో భార్య అలియా భట్టే హీరోయిన్ కావడం కొసమెరుపు.
This post was last modified on January 24, 2024 7:11 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…