Political News

ఇండియా కూటమికి దీదీ గుడ్ బై

2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ను ఈ సారి ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. అయితే, ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి అందులోని పార్టీల మధ్య ఐకమత్యం లోపించిందని విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ…ఇండియా కూటమికి అంటిముట్టునట్లు ఉంటున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా ఇండియా కూటమికి దీదీ గుడ్ బై చెప్పేశారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే, ఫలితాల తర్వాతే కాంగ్రెస్ తో పొత్తును పరిశీలిస్తామని దీదీ ప్రకటించారు. కాంగ్రెస్ తో తాను ఎటువంటి చర్చలు జరపలేదని, ఒంటరి పోరు చేస్తానని తాను గతంలో కూడా చెప్పానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిపాదనలు చేశానని, కానీ, అన్నింటినీ వారు తిరస్కరించారని చెప్పారు. తమది లౌకిక పార్టీ అని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో న్యాయ యాత్ర బెంగాల్ లో ప్రవేశించబోతోందని, ప్రతిపక్ష కూటమిలో ఉన్న తనకు ఆ యాత్ర పై సమాచారం ఇవ్వాలన్న కనీస మర్యాద కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే, బెంగాల్ కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదలచుకోలేదని క్లారిటీనిచ్చారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఇబ్బంది లేదని, కానీ బెంగాల్ లో మాత్రం టీఎంసీ ఒంటరిగానే పోరాడుతుందని చెప్పారు. బెంగాల్ లో బీజేపీకి బుద్ధి చెప్పగలిగిన సత్తా ఉన్న పార్టీ టీఎంసీ మాత్రమేనని అన్నారు. మరి దీదీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి బలమైన టిఎంసి దూరం కావడంతో ఆ కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

This post was last modified on January 24, 2024 7:20 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago