Political News

ఇండియా కూటమికి దీదీ గుడ్ బై

2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ను ఈ సారి ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. అయితే, ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి అందులోని పార్టీల మధ్య ఐకమత్యం లోపించిందని విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ…ఇండియా కూటమికి అంటిముట్టునట్లు ఉంటున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా ఇండియా కూటమికి దీదీ గుడ్ బై చెప్పేశారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే, ఫలితాల తర్వాతే కాంగ్రెస్ తో పొత్తును పరిశీలిస్తామని దీదీ ప్రకటించారు. కాంగ్రెస్ తో తాను ఎటువంటి చర్చలు జరపలేదని, ఒంటరి పోరు చేస్తానని తాను గతంలో కూడా చెప్పానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిపాదనలు చేశానని, కానీ, అన్నింటినీ వారు తిరస్కరించారని చెప్పారు. తమది లౌకిక పార్టీ అని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో న్యాయ యాత్ర బెంగాల్ లో ప్రవేశించబోతోందని, ప్రతిపక్ష కూటమిలో ఉన్న తనకు ఆ యాత్ర పై సమాచారం ఇవ్వాలన్న కనీస మర్యాద కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే, బెంగాల్ కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదలచుకోలేదని క్లారిటీనిచ్చారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఇబ్బంది లేదని, కానీ బెంగాల్ లో మాత్రం టీఎంసీ ఒంటరిగానే పోరాడుతుందని చెప్పారు. బెంగాల్ లో బీజేపీకి బుద్ధి చెప్పగలిగిన సత్తా ఉన్న పార్టీ టీఎంసీ మాత్రమేనని అన్నారు. మరి దీదీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి బలమైన టిఎంసి దూరం కావడంతో ఆ కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

This post was last modified on January 24, 2024 7:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

1 hour ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

1 hour ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

1 hour ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

2 hours ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

3 hours ago