Political News

ఇండియా కూటమికి దీదీ గుడ్ బై

2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ను ఈ సారి ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. అయితే, ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి అందులోని పార్టీల మధ్య ఐకమత్యం లోపించిందని విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ…ఇండియా కూటమికి అంటిముట్టునట్లు ఉంటున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా ఇండియా కూటమికి దీదీ గుడ్ బై చెప్పేశారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే, ఫలితాల తర్వాతే కాంగ్రెస్ తో పొత్తును పరిశీలిస్తామని దీదీ ప్రకటించారు. కాంగ్రెస్ తో తాను ఎటువంటి చర్చలు జరపలేదని, ఒంటరి పోరు చేస్తానని తాను గతంలో కూడా చెప్పానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిపాదనలు చేశానని, కానీ, అన్నింటినీ వారు తిరస్కరించారని చెప్పారు. తమది లౌకిక పార్టీ అని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో న్యాయ యాత్ర బెంగాల్ లో ప్రవేశించబోతోందని, ప్రతిపక్ష కూటమిలో ఉన్న తనకు ఆ యాత్ర పై సమాచారం ఇవ్వాలన్న కనీస మర్యాద కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే, బెంగాల్ కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదలచుకోలేదని క్లారిటీనిచ్చారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఇబ్బంది లేదని, కానీ బెంగాల్ లో మాత్రం టీఎంసీ ఒంటరిగానే పోరాడుతుందని చెప్పారు. బెంగాల్ లో బీజేపీకి బుద్ధి చెప్పగలిగిన సత్తా ఉన్న పార్టీ టీఎంసీ మాత్రమేనని అన్నారు. మరి దీదీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి బలమైన టిఎంసి దూరం కావడంతో ఆ కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

This post was last modified on January 24, 2024 7:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

2 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

6 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

8 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

12 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

14 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

14 hours ago