Movie News

థియేటర్ల వ్యవహారం – నిర్మాతల మండలి సీరియస్

నివురు గప్పిన నిప్పులా ప్రొడ్యూసర్ల మధ్యే ఉన్న థియేటర్ల రచ్చ ఇప్పుడు నిర్మాతల మండలి సాక్షిగా అధికారికంగా బహిర్గతమయ్యింది. హనుమాన్ పంపిణి హక్కులు కొన్న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ జనవరి 12 నుంచి తమ సినిమాకు అగ్రిమెంట్లు చేసుకున్న కొందరు నైజామ్ ఎగ్జిబిటర్లు నిబంధనలు ఉల్లంఘించి తమది ప్రదర్శించకుండా వేరేవవాటికి ఇచ్చారని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేయడంతో మీడియాకు అఫీషియల్ గా సమాచారం ఇచ్చారు. దీని వల్ల కలిగిన నష్టాన్ని భరించడంతో పాటు వెంటనే హనుమాన్ ని ప్రదర్శించాలని సదరు ప్రెస్ నోట్ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

హనుమాన్ థియేటర్లకు జరిగిన అన్యాయం గురించి మైత్రి, ఏషియన్ మధ్య రేగిన వివాదం నిన్న హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గుంటూరు కారంకి ప్రాధాన్యత ఇచ్చారని, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాబట్టి ఆయనదే బాధ్యత అన్నట్టు కొందరు కామెంట్ చేశారనే గుసగుస ఫిలిం నగర్ వర్గాల్లో వినిపించింది. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ బాబు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారని కాసేపు మాట్లాడిన దిల్ రాజు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా సమావేశం ముగించేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటికీ లెటర్ బయటికి రాలేదు.

తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. నైజామ్ లో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ హనుమాన్ కి థియేటర్ల కొరత విపరీతంగా ఉంది. బుక్ మై షోలో ఒక్క టికెట్ దొరకడం లేదు. రేపటికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మిగిలిన వాటికి రెస్పాన్స్ లేకపోయినా భారీ ఎత్తున షోలు బ్లాక్ చేసి పెట్టారని మూవీ లవర్స్ వాపోతున్నారు. మరి దీని పట్ల ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంతకీ ఒప్పందం తూచ్ అన్న థియేటర్లు ఏవో వాటి వివరాలేంటో అందులో పేర్కొనలేదు. బ్లాక్ బస్టర్ అయినా హనుమాన్ కి ఈ కష్టాలు ఏంటో మరి. 

This post was last modified on January 13, 2024 9:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

7 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

39 minutes ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

4 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

5 hours ago