నివురు గప్పిన నిప్పులా ప్రొడ్యూసర్ల మధ్యే ఉన్న థియేటర్ల రచ్చ ఇప్పుడు నిర్మాతల మండలి సాక్షిగా అధికారికంగా బహిర్గతమయ్యింది. హనుమాన్ పంపిణి హక్కులు కొన్న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ జనవరి 12 నుంచి తమ సినిమాకు అగ్రిమెంట్లు చేసుకున్న కొందరు నైజామ్ ఎగ్జిబిటర్లు నిబంధనలు ఉల్లంఘించి తమది ప్రదర్శించకుండా వేరేవవాటికి ఇచ్చారని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేయడంతో మీడియాకు అఫీషియల్ గా సమాచారం ఇచ్చారు. దీని వల్ల కలిగిన నష్టాన్ని భరించడంతో పాటు వెంటనే హనుమాన్ ని ప్రదర్శించాలని సదరు ప్రెస్ నోట్ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
హనుమాన్ థియేటర్లకు జరిగిన అన్యాయం గురించి మైత్రి, ఏషియన్ మధ్య రేగిన వివాదం నిన్న హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గుంటూరు కారంకి ప్రాధాన్యత ఇచ్చారని, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాబట్టి ఆయనదే బాధ్యత అన్నట్టు కొందరు కామెంట్ చేశారనే గుసగుస ఫిలిం నగర్ వర్గాల్లో వినిపించింది. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ బాబు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారని కాసేపు మాట్లాడిన దిల్ రాజు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా సమావేశం ముగించేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటికీ లెటర్ బయటికి రాలేదు.
తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. నైజామ్ లో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ హనుమాన్ కి థియేటర్ల కొరత విపరీతంగా ఉంది. బుక్ మై షోలో ఒక్క టికెట్ దొరకడం లేదు. రేపటికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మిగిలిన వాటికి రెస్పాన్స్ లేకపోయినా భారీ ఎత్తున షోలు బ్లాక్ చేసి పెట్టారని మూవీ లవర్స్ వాపోతున్నారు. మరి దీని పట్ల ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంతకీ ఒప్పందం తూచ్ అన్న థియేటర్లు ఏవో వాటి వివరాలేంటో అందులో పేర్కొనలేదు. బ్లాక్ బస్టర్ అయినా హనుమాన్ కి ఈ కష్టాలు ఏంటో మరి.
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…
శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…