Political News

క‌మ్మ వ‌ర్సెస్ బీసీ.. జ‌గ‌న్ ఫార్ములా ఇది!

రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ చేసిన మార్పులు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అవి కూడా పార్ల‌మెంటు స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం. బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం వ‌హిస్తు న్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చేసిన మార్పులు.. రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అవే.. ఒక‌టి ఏలూరు పార్ల‌మెంటు స్థానం, రెండు.. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌స్తుతం క‌మ్మ నేత‌ల చేతిలోనే ఉన్నాయి. విశాఖ ఎంపీగా.. వైసీపీ నాయ‌కు డు ఎంవీవీస‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. ఈయ‌న క‌మ్మ వర్గానికి చెందిన నాయ‌కుడు. తొలిసారి టికెట్ తీసుకుని గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఏలూరు నుంచి కూడా క‌మ్మ వ‌ర్గానికే చెందిన కోట‌గిరి శ్రీధ‌ర్ ఎంపీ గా ఉన్నారు. ఇప్పుడు ఈయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకున్న ఆయ‌న‌కు సొంత కేడ‌ర్ నుంచే అస‌మ్మ‌తి సెగ రావ‌డంతో ప‌క్క‌న పెట్టార‌నే చ‌ర్చ ఉంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఆయా జిల్లాల్లోనే కాదు.. రాజకీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నా యి. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త నాలుగు ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. బీసీల‌కు ఇక్క‌డ ఛాన్స్ లేదు. గ‌తంలో ఏలూరు నుంచి మాగంటి బాబు(క‌మ్మ‌) ప్రాతినిధ్యం వ‌హించారు. త‌ర్వాత‌.. ఇదే సామాజిక వ‌ర్గం నేత కోట‌గిరి ఇక్క‌డి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. ఇప్పుడు ఇక్కడ బీసీ సామాజిక వ‌ర్గం యాద‌వ కులానికి చెందిన కారుమూరి సునీల్‌కు వైసీపీ టికెట్ ఇచ్చేసింది.

ఇక‌, విశాఖ‌లోనూ కొన్ని ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. గ‌తంలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ కూడా.. క‌మ్మ‌ల కే ప్రాధాన్యం ఇచ్చాయి. కాంగ్రెస్ నుంచి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విజ‌యం ద‌క్కించుకోగా.. బీజేపీ నుంచి కంభంపాటి హ‌రిబాబు విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. వైసీపీ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గానికే టికెట్ ఇచ్చింది.

ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు బీసీ నాయ‌కురాలు.. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకోవ‌డంతోపాటు.. బీసీల‌కు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు టీడీపీ ఎలాంటి అడుగులు వేస్తుంద‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

This post was last modified on January 13, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

46 minutes ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

2 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

2 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago