Political News

ప‌వ‌న్‌-చంద్ర‌బాబు.. భేటీ.. విష‌యం సీరియ‌స్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్‌లు.. తాజాగా డిన్న‌ర్ భేటీ నిర్వ‌హించ‌నున్నారు. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జ‌ర‌గ‌నున్న ఈ భేటీకి చాలా ప్రాధాన్యం ఉంద‌ని ఇరు పార్టీల వ‌ర్గాలు తెలిపాయి. అత్యంత త‌క్కువ మందిని మాత్ర‌మే ఈ పార్టీకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి ఐదుగురు, జ‌న‌సేన నుంచి న‌లుగురు మాత్రమే ఈ డిన్న‌ర్ బేటీకి హాజ‌ర‌వుతు న్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోనే చంద్ర‌బాబు.. సీఐడీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్క‌డ నుంచి మ‌రోసారి తాడేప‌ల్లిలోని సీఐడీ కార్యాల‌యానికి వెళ్లారు. అనంత‌రం.. ఆయ‌న ఉండ‌వ‌ల్లికి చేరుకుంటారు.

ఈ రోజు రాత్రికి ఉండ‌వ‌ల్లిలోనే ఉండ‌నున్న చంద్ర‌బాబు డిన్న‌ర్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జన‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌హా మ‌రో ఇద్ద‌రు హాజరుకానున్నారు. ఇక‌, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు స‌హా ఇంకో ఇద్ద‌రు నుంచి ముగ్గురు పాల్గొనే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు స‌హా.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న నాయ‌కులను చేర్చుకునే విష‌యంపై ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని స‌మాచారం.

వీట‌న్నింటికంటే ముఖ్యంగా.. టీడీపీ-జ‌న‌సేన పార్టీల కు సంబంధించిన అభ్య‌ర్థుల తొలి జాబితాను సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌క టించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ జాబితాపై ప్ర‌ధానంగా తుది క‌స‌ర‌త్తు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ నుం చి వ‌చ్చే వారి చేరిక‌ల అంశాల‌ను కూడా.. చంద్ర‌బాబు ప‌వ‌న్‌లు చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి ఏర్పాటు చేయ‌నున్న స‌భ‌లు.. ఉమ్మ‌డి కార్యాచర‌ణ‌, క్షేత్ర‌స్థాయిలో అనుస‌రించాల్సిన వ్యూహాలు.. వంటి కీల‌క‌మైన అంశాల‌పై.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఈ భేటీలో చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. డిన్న‌ర్ భేటీనే ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర‌గ‌బోయే కీల‌క భేటీ అని ఇరు పార్టీల వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, నుంచి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు నేరుగా ప్రజాక్షేత్రంలోనే క‌నిపిస్తార‌ని అంటున్నారు.

This post was last modified on January 13, 2024 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

10 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

45 minutes ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

6 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

6 hours ago