Political News

ప‌వ‌న్‌-చంద్ర‌బాబు.. భేటీ.. విష‌యం సీరియ‌స్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్‌లు.. తాజాగా డిన్న‌ర్ భేటీ నిర్వ‌హించ‌నున్నారు. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జ‌ర‌గ‌నున్న ఈ భేటీకి చాలా ప్రాధాన్యం ఉంద‌ని ఇరు పార్టీల వ‌ర్గాలు తెలిపాయి. అత్యంత త‌క్కువ మందిని మాత్ర‌మే ఈ పార్టీకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి ఐదుగురు, జ‌న‌సేన నుంచి న‌లుగురు మాత్రమే ఈ డిన్న‌ర్ బేటీకి హాజ‌ర‌వుతు న్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోనే చంద్ర‌బాబు.. సీఐడీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్క‌డ నుంచి మ‌రోసారి తాడేప‌ల్లిలోని సీఐడీ కార్యాల‌యానికి వెళ్లారు. అనంత‌రం.. ఆయ‌న ఉండ‌వ‌ల్లికి చేరుకుంటారు.

ఈ రోజు రాత్రికి ఉండ‌వ‌ల్లిలోనే ఉండ‌నున్న చంద్ర‌బాబు డిన్న‌ర్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జన‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌హా మ‌రో ఇద్ద‌రు హాజరుకానున్నారు. ఇక‌, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు స‌హా ఇంకో ఇద్ద‌రు నుంచి ముగ్గురు పాల్గొనే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు స‌హా.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న నాయ‌కులను చేర్చుకునే విష‌యంపై ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని స‌మాచారం.

వీట‌న్నింటికంటే ముఖ్యంగా.. టీడీపీ-జ‌న‌సేన పార్టీల కు సంబంధించిన అభ్య‌ర్థుల తొలి జాబితాను సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌క టించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ జాబితాపై ప్ర‌ధానంగా తుది క‌స‌ర‌త్తు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ నుం చి వ‌చ్చే వారి చేరిక‌ల అంశాల‌ను కూడా.. చంద్ర‌బాబు ప‌వ‌న్‌లు చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి ఏర్పాటు చేయ‌నున్న స‌భ‌లు.. ఉమ్మ‌డి కార్యాచర‌ణ‌, క్షేత్ర‌స్థాయిలో అనుస‌రించాల్సిన వ్యూహాలు.. వంటి కీల‌క‌మైన అంశాల‌పై.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఈ భేటీలో చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. డిన్న‌ర్ భేటీనే ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర‌గ‌బోయే కీల‌క భేటీ అని ఇరు పార్టీల వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, నుంచి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు నేరుగా ప్రజాక్షేత్రంలోనే క‌నిపిస్తార‌ని అంటున్నారు.

This post was last modified on January 13, 2024 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago