Movie News

తెలివైన దర్శకుల చిన్న సినిమాలు

దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం బయట సామెత. గ్యాప్ దొరికినప్పుడే ఎక్కువ సినిమాలు చేయడం ఇండస్ట్రీ నానుడి. దాన్ని అందరూ ఫాలో కాలేరు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఈ సూత్రం పాటించేవారు కానీ ఇప్పుడంతా నిదానమే ప్రధానం బ్యాచే. బడ్జెట్ లెక్కలు, హీరోల కండీషన్లు, పారితోషికాలు ఇలా సవాలక్ష కారణాలుంటాయి. ఇద్దరు మాత్రం దీనికి మినహాయింపుగా తెరవెనుక పరుగులు పెడుతూ ఫిల్మోగ్రఫీ పెంచుకుంటున్నారు. ఒకరు గౌతమ్ తిన్ననూరి. విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఫ్యామిలీ స్టార్ వల్ల రెగ్యులర్ షూటింగ్ పెండింగ్ పడింది.

తిరిగి ఫిబ్రవరిలో కాని మొదలుపెట్టలేని పరిస్థితి. ఇంకా చాలా టైం ఉండటంతో తక్కువ బడ్జెట్ లో గౌతమ్ కొత్తవాళ్ళతో ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ తీశారని ఇన్ సైడ్ టాక్. పాటలకు చాలా ప్రాధాన్యం ఉండటంతో అనిరుద్ రవిచందర్ తో కంపోజ్ చేయించారట. చెన్నైలోనే దీనికి సంబంధించిన రికార్డింగ్ జరిగినట్టు సమాచారం. రెండో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ ఎప్పుడో పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించి మధ్యలో నెలల సమయం దొరకడంతో గౌతమ్ లాగే రీజనబుల్ ఖర్చుతో ఓ మూవీని సౌండ్ లేకుండా సైలెంట్ గా పూర్తి చేశాడని వినికిడి.

ఈ రెండు ప్రోజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు కానీ చేతిలో పెద్ద సినిమాలున్నాయని నింపాదిగా ఉండకుండా ఇలా చేయడం మంచిదే. వీలైనంత ఎక్కువ బిజీగా హీరోలు, దర్శకులు ఉన్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అలా కాకుండా ఏళ్ళు గడిచిపోయినా పర్వాలేదు నెమ్మదిగా తీద్దాం అనుకుంటేనే సమస్య. గౌతమ్, ప్రశాంత్ వర్మ ఇద్దరూ వీటి గురించి ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ సరైన సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారట. జెర్సీ హిందీ రీమేక్ నిరాశపరిచాక గౌతమ్, జొంబి రెడ్డితో హిట్ అందుకున్నాక ప్రశాంత్ వర్మలకు భారీ బ్లాక్ బస్టర్ అవసరమే.

This post was last modified on November 30, 2023 8:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

7 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago