తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన అగ్రనాయకులకు.. ఓటర్లు షాకిచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులను ఓడించేందుకు రెడీ అయినట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ప్రజలు రెండేసి స్థానాల్లో పోటీచేసిన నాయకులను ఒక్క స్థానానికే పరిమితం చేయడం గమనార్హం.
కేసీఆర్: రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తెలంగాణకు ముందు.. తర్వాత కూడా.. కేసీఆర్ ఇలా రెండు చోట్ల నుంచి పోటీ చేయడం అరుదు. ఎప్పుడూ.. సంప్రదాయంగా ఆయన గజ్వేల్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నారు. కానీ, ఎందుకో తేడా కొడుతుందని ఊహించి.. ఈ సారి కామారెడ్డి నుంచి బరిలో నిలిచారు. కానీ, కామారెడ్డిలోనే ఆయన ఓడిపోతున్నారనేది సర్వేల అంచనా. ఇక, సంప్రదాయ గజ్వేల్లో మాత్రం విజయం దక్కించుకోనున్నారు.
రేవంత్రెడ్డి: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయిన రేవంత్రెడ్డి తొలిసారి రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తనకు సంప్రదాయంగా ఉన్న కొడంగల్ సహా.. కామారెడ్డి నుంచి ఆయన బరిలో నిలిచారు. అయితే.. ఈయనకు కూడా.. కామారెడ్డి ప్రజలు జై కొట్టలేదు. కేవలం కొడంగల్లో మాత్రం గెలుపు గుర్రం ఎక్కనున్నారని.. సర్వేలు చాటిచెబుతున్నాయి. దీంతో ఈయన చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది.
ఈటల రాజేందర్: బీజేపీ సీనియర్ నేత, ప్రచార కమిటీ కన్వీనర్కూడా. అయితే..ఈ యన కూడా ఈ సారి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. సంప్రదాయ హుజూరాబాద్ నియోజకవర్గం సహా.. సీఎం కేసీఆర్ను ఓడించాలనే లక్ష్యంతో గజ్వేల్ నుంచి తొలిసారి బరిలో నిలిచారు. అయితే.. హుజూరాబాద్ ప్రజలే ఆయనకు జై కొట్టినట్టు సర్వేలు తేల్చాయి. గజ్వేల్లో ఘోర పరాజయం తప్పదని వెల్లడించాయి. ఈ ముగ్గురి విషయం.. రాష్ట్ర ఎన్నికల్లో ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 30, 2023 10:24 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…