తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన అగ్రనాయకులకు.. ఓటర్లు షాకిచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులను ఓడించేందుకు రెడీ అయినట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ప్రజలు రెండేసి స్థానాల్లో పోటీచేసిన నాయకులను ఒక్క స్థానానికే పరిమితం చేయడం గమనార్హం.
కేసీఆర్: రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తెలంగాణకు ముందు.. తర్వాత కూడా.. కేసీఆర్ ఇలా రెండు చోట్ల నుంచి పోటీ చేయడం అరుదు. ఎప్పుడూ.. సంప్రదాయంగా ఆయన గజ్వేల్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నారు. కానీ, ఎందుకో తేడా కొడుతుందని ఊహించి.. ఈ సారి కామారెడ్డి నుంచి బరిలో నిలిచారు. కానీ, కామారెడ్డిలోనే ఆయన ఓడిపోతున్నారనేది సర్వేల అంచనా. ఇక, సంప్రదాయ గజ్వేల్లో మాత్రం విజయం దక్కించుకోనున్నారు.
రేవంత్రెడ్డి: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయిన రేవంత్రెడ్డి తొలిసారి రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తనకు సంప్రదాయంగా ఉన్న కొడంగల్ సహా.. కామారెడ్డి నుంచి ఆయన బరిలో నిలిచారు. అయితే.. ఈయనకు కూడా.. కామారెడ్డి ప్రజలు జై కొట్టలేదు. కేవలం కొడంగల్లో మాత్రం గెలుపు గుర్రం ఎక్కనున్నారని.. సర్వేలు చాటిచెబుతున్నాయి. దీంతో ఈయన చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది.
ఈటల రాజేందర్: బీజేపీ సీనియర్ నేత, ప్రచార కమిటీ కన్వీనర్కూడా. అయితే..ఈ యన కూడా ఈ సారి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. సంప్రదాయ హుజూరాబాద్ నియోజకవర్గం సహా.. సీఎం కేసీఆర్ను ఓడించాలనే లక్ష్యంతో గజ్వేల్ నుంచి తొలిసారి బరిలో నిలిచారు. అయితే.. హుజూరాబాద్ ప్రజలే ఆయనకు జై కొట్టినట్టు సర్వేలు తేల్చాయి. గజ్వేల్లో ఘోర పరాజయం తప్పదని వెల్లడించాయి. ఈ ముగ్గురి విషయం.. రాష్ట్ర ఎన్నికల్లో ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…