Political News

ఎగ్జిట్ పోల్ సర్వే తప్పు…70 సీట్లు పక్కా: కేటీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ పోయడంతో సర్వత్రా ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వెల్లడైంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వేలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ వైపు పోలింగ్ పూర్తవ్వకుండానే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలని కేటీఆర్ కోరారు. కొన్ని జాతీయ సంస్థలు, కొన్ని మీడియా ఛానళ్లు, మరి కొన్ని సర్వే సంస్థలు నామమాత్రంగా కొన్ని శాంపిల్స్ తీసుకొని అదే ప్రజాభిప్రాయం అని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటాయని, ఆ పద్ధతి సరికాదని అన్నారు.

అయితే, ఫలితాలు తారుమారైతే ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుందన్న విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ పలితాలు సర్వేలకు ప్రతికూలంగా వస్తే ఏం చేస్తారని ఆయా సంస్థలనుద్దేశించి ప్రశ్నించారు. 2018 ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఈ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని, కానీ, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కన్నా ప్రజలనే ఎక్కువగా నమ్ముతామని, తమకు ఈ సారి 70కి పైగా స్థానాలు వస్తాయని అన్నారు. డిసెంబర్ 3వ తేదీన అందరూ ఫలితాలను చూస్తారని చెప్పారు.

ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ ఎన్నికల కోసం వారంతా చాలా కష్టపడ్డారని, వారందరికీ ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నారు.

This post was last modified on November 30, 2023 8:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

27 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

7 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

10 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

12 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

13 hours ago