లియో ఫస్ట్ హాఫ్ లో ప్రధానంగా చెప్పుకునే హైలైట్స్ లో విజయ్ పోషించిన పార్తీబన్ పాత్ర తన కాఫీ షాప్ లో సృష్టించే నరమేథం. రౌడీ గ్యాంగ్ లో సైకో ఒకడు వచ్చి అర్ధరాత్రి చాకొలేట్ కాఫీ అడగటమే కాకుండా రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిని దగ్గరకు తీసుకుని వేధించబోతాడు. అక్కడితో ఆగకుండా హీరో కూతురిని టార్గెట్ చేయడంతో విజయ్ గన్ను తీసుకుని ఎడాపెడా ముఠాని మొత్తం పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కణితిలో బులెట్ దిగేలా కాల్చి పారేస్తాడు. అప్పటిదాకా శాంతమూర్తిలా కనిపించిన విజయ్ ఒక్కసారిగా వయొలెంట్ గా మారిపోవడం థియేటర్లో ఓ రేంజ్ లో పేలింది.
దీనికి జగపతిబాబుకి కనెక్షన్ ఏంటని డౌటా. అక్కడికే వద్దాం. 2010లో వచ్చిన గాయం 2లో అచ్చం ఇదే ఎపిసోడ్ ఉంటుంది. హోటల్ లో తనతో పాటు హర్షవర్ధన్ పని చేసుకుంటూ ఉండగా షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇద్దరు గూండాలు వస్తారు. మూశామని చెప్పినా సరే కాఫీ డిమాండ్ చేస్తారు. అయినా సరే ప్రశాంతంగా తయారు చేసి ఇచ్చేలోపు వాళ్లలో ఒకడు అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఇబ్బంది పెడతాడు. దీంతో పెనుగులాట మొదలై జగ్గు భాయ్ ఇద్దరినీ పిస్టల్ తో లేపి పారేసి షాక్ తిన్న ఎక్స్ ప్రెషన్ తో కుప్పకూలిపోతాడు. లియోకి ఈ సీన్ కి ఎంత సారూప్యం ఉందో మళ్ళీ చెప్పనక్కర్లేదు.
2005లో హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని లియో రాసుకున్నానని దర్శకుడు లోకేష్ కనగరాజ్ టైటిల్ కార్డులోనే ఒప్పేసుకున్నాడు. గాయం 2 కూడా దాని నుంచి ఇన్స్ పిరేషన్ తీసుకున్నదే. కాకపోతే మొత్తం కథ కాకుండా సగం వాడుకుని సెకండ్ హాఫ్ లో గాయం మొదటి భాగం తాలూకు ట్విస్టులను వాడుకున్నారు. కానీ అవి సరైన రీతిలో పండకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడీ జగపతిబాబు వీడియోని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. లోకేష్ కాపీ కొట్టాడని, తెలుగులో ఎప్పుడో తీశారని రెండింటి పోలికలను బట్టబయలు చేస్తున్నారు. ఇలాంటి టాపిక్స్ దొరకాలే కానీజనం మాములుగా చెలరేగిపోరు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…