Movie News

నాగేశ్వరరావు మేలుకొలుపు ఎందరికో అవసరం

తాము తీసిన అవుట్ ఫుట్ ని అవసరానికి మించి ప్రేమించి విపరీత నిడివితో టాక్ ని దెబ్బ తీసుకుంటున్న దర్శకులకు టైగర్ నాగేశ్వరరావు మేలుకొలుపు ఓ పాఠంగా నిలుస్తోంది. విడుదలైన మూడో రోజుకే 24 నిమిషాల నిడివిని కత్తిరించడం రవితేజ లాంటి స్టార్ హీరో విషయంలో ఇదే మొదటిసారని చెప్పాలి. ఈ నిర్ణయమేదో ముందే తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీని వల్ల ఇప్పటికిప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయిపోదు కానీ టాక్ మరింత డ్యామేజ్ కాకుండా కాస్తయినా బెటర్ గా డీసెంట్ గా వచ్చే అవకాశముంది.

ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు, హీరో, నిర్మాత ఈ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ కట్ చేశామని చెప్పుకుంటే దాని వల్ల లేనిపోని కామెంట్లకు చోటిచ్చినట్టు అవుతుందని సినిమా విజయం గురించే మాట్లాడారు. విడుదలకు ముందు ఇంటర్వ్యూలలో చాలా నమ్మకంగా ఇంకో గంట ఎక్స్ ట్రా ఉన్నా టైగర్ నాగేశ్వరరావు కథను ఎగబడి చూస్తారని చెప్పిన వంశీ టోన్ లో ఈ రోజు చాలా మార్పు కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందని, ఫ్యాన్స్ వీడియోలు పంపించి తమ ఆనందాన్ని పంచుకున్నారని చెప్పుకున్నాడు.

రాబోయే రోజుల్లో మూడు గంటల ఫైనల్ కట్ వచ్చే సినిమాల విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉండబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. అంటే సుందరానికి, ఖుషిల రన్ ఈ కారణంగానే ప్రభావితం చెందటం అభిమానులు మర్చిపోలేరు. నిజంగా ప్రెజెంటేషన్ అద్భుతంగా వచ్చి ఎక్కడ బోరే కొట్టలేదనుకుంటే నిజంగా అంత లెన్త్ ని థియేటర్ ప్రేక్షకులు స్వాగతిస్తారు. అది వదిలేసి ఆత్మవంచన చేసుకునే తరహాలో మేము గొప్పగా తీశాం, ఎడిటింగ్ చేసే సమస్యే లేదని భీష్మించుకు కూర్చుంటే ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో టైగర్ లెసన్ ఒక కనువిప్పుగా మిగిలిపోనుంది. 

Satya

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

1 hour ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

2 hours ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

3 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

4 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

4 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

4 hours ago