Movie News

నాగేశ్వరరావు మేలుకొలుపు ఎందరికో అవసరం

తాము తీసిన అవుట్ ఫుట్ ని అవసరానికి మించి ప్రేమించి విపరీత నిడివితో టాక్ ని దెబ్బ తీసుకుంటున్న దర్శకులకు టైగర్ నాగేశ్వరరావు మేలుకొలుపు ఓ పాఠంగా నిలుస్తోంది. విడుదలైన మూడో రోజుకే 24 నిమిషాల నిడివిని కత్తిరించడం రవితేజ లాంటి స్టార్ హీరో విషయంలో ఇదే మొదటిసారని చెప్పాలి. ఈ నిర్ణయమేదో ముందే తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీని వల్ల ఇప్పటికిప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయిపోదు కానీ టాక్ మరింత డ్యామేజ్ కాకుండా కాస్తయినా బెటర్ గా డీసెంట్ గా వచ్చే అవకాశముంది.

ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు, హీరో, నిర్మాత ఈ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ కట్ చేశామని చెప్పుకుంటే దాని వల్ల లేనిపోని కామెంట్లకు చోటిచ్చినట్టు అవుతుందని సినిమా విజయం గురించే మాట్లాడారు. విడుదలకు ముందు ఇంటర్వ్యూలలో చాలా నమ్మకంగా ఇంకో గంట ఎక్స్ ట్రా ఉన్నా టైగర్ నాగేశ్వరరావు కథను ఎగబడి చూస్తారని చెప్పిన వంశీ టోన్ లో ఈ రోజు చాలా మార్పు కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందని, ఫ్యాన్స్ వీడియోలు పంపించి తమ ఆనందాన్ని పంచుకున్నారని చెప్పుకున్నాడు.

రాబోయే రోజుల్లో మూడు గంటల ఫైనల్ కట్ వచ్చే సినిమాల విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉండబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. అంటే సుందరానికి, ఖుషిల రన్ ఈ కారణంగానే ప్రభావితం చెందటం అభిమానులు మర్చిపోలేరు. నిజంగా ప్రెజెంటేషన్ అద్భుతంగా వచ్చి ఎక్కడ బోరే కొట్టలేదనుకుంటే నిజంగా అంత లెన్త్ ని థియేటర్ ప్రేక్షకులు స్వాగతిస్తారు. అది వదిలేసి ఆత్మవంచన చేసుకునే తరహాలో మేము గొప్పగా తీశాం, ఎడిటింగ్ చేసే సమస్యే లేదని భీష్మించుకు కూర్చుంటే ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో టైగర్ లెసన్ ఒక కనువిప్పుగా మిగిలిపోనుంది. 

This post was last modified on October 23, 2023 12:19 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

10 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago