Movie News

నాగేశ్వరరావు మేలుకొలుపు ఎందరికో అవసరం

తాము తీసిన అవుట్ ఫుట్ ని అవసరానికి మించి ప్రేమించి విపరీత నిడివితో టాక్ ని దెబ్బ తీసుకుంటున్న దర్శకులకు టైగర్ నాగేశ్వరరావు మేలుకొలుపు ఓ పాఠంగా నిలుస్తోంది. విడుదలైన మూడో రోజుకే 24 నిమిషాల నిడివిని కత్తిరించడం రవితేజ లాంటి స్టార్ హీరో విషయంలో ఇదే మొదటిసారని చెప్పాలి. ఈ నిర్ణయమేదో ముందే తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీని వల్ల ఇప్పటికిప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయిపోదు కానీ టాక్ మరింత డ్యామేజ్ కాకుండా కాస్తయినా బెటర్ గా డీసెంట్ గా వచ్చే అవకాశముంది.

ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు, హీరో, నిర్మాత ఈ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ కట్ చేశామని చెప్పుకుంటే దాని వల్ల లేనిపోని కామెంట్లకు చోటిచ్చినట్టు అవుతుందని సినిమా విజయం గురించే మాట్లాడారు. విడుదలకు ముందు ఇంటర్వ్యూలలో చాలా నమ్మకంగా ఇంకో గంట ఎక్స్ ట్రా ఉన్నా టైగర్ నాగేశ్వరరావు కథను ఎగబడి చూస్తారని చెప్పిన వంశీ టోన్ లో ఈ రోజు చాలా మార్పు కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందని, ఫ్యాన్స్ వీడియోలు పంపించి తమ ఆనందాన్ని పంచుకున్నారని చెప్పుకున్నాడు.

రాబోయే రోజుల్లో మూడు గంటల ఫైనల్ కట్ వచ్చే సినిమాల విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉండబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. అంటే సుందరానికి, ఖుషిల రన్ ఈ కారణంగానే ప్రభావితం చెందటం అభిమానులు మర్చిపోలేరు. నిజంగా ప్రెజెంటేషన్ అద్భుతంగా వచ్చి ఎక్కడ బోరే కొట్టలేదనుకుంటే నిజంగా అంత లెన్త్ ని థియేటర్ ప్రేక్షకులు స్వాగతిస్తారు. అది వదిలేసి ఆత్మవంచన చేసుకునే తరహాలో మేము గొప్పగా తీశాం, ఎడిటింగ్ చేసే సమస్యే లేదని భీష్మించుకు కూర్చుంటే ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో టైగర్ లెసన్ ఒక కనువిప్పుగా మిగిలిపోనుంది. 

This post was last modified on October 23, 2023 12:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

34 minutes ago

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…

40 minutes ago

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…

3 hours ago

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…

3 hours ago

అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం  సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…

3 hours ago

ఒక్క టికెట్ 2400 రూపాయలు… అయినా సోల్డవుట్

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…

4 hours ago