గత ఏడాది భీమ్లా నాయక్ రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. బెనిఫిట్ షోలు రద్దు చేయడం, టికెట్లు అధిక ధరలకు అమ్మకుండా కట్టడి చేసేందుకు స్వయంగా రెవిన్యూ అధికారులు థియేటర్ల దగ్గర కాపు కాయడం ఇలా చాలా జరిగాయి. కొన్ని చోట్ల ఏకంగా ఎంఆర్ఓల ఫోన్ నెంబర్లు బోర్డు రాయించి మరీ ఎగ్జిబిటర్లకు చుక్కలు చూపించిన ఉదంతాలున్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకున్నదేనని బాహాటంగా ఒప్పుకునే వాస్తవం. వకీల్ సాబ్ అప్పుడు కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి.
అచ్చం ఇదే తరహాలో లియో విషయంలో స్టాలిన్ సర్కార్ కఠినంగా వ్యవహరించడం పెద్ద రచ్చకు దారి తెస్తోంది. మొదటి రోజు ముందు తెల్లవారుఝాము 4 గంటల షోలకు అనుమతినిచ్చి ఆ తర్వాత వాటిని రద్దు చేస్తూ ఉదయం 9 కన్నా ముందు వేయకూడదని మరో జిఓ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని మీద నిర్మాత ఏకంగా కోర్టుకు వెళ్లారు. ఈలోగా లియో టికెట్లు తమిళనాడులో ఎవరూ ఎక్కువ రేట్లకు అమ్మకూడదని, ఒకవేళ అలా ఎవరైనా చేసినా వెంటనే సంబంధిత ఆఫీసర్లకు తెలుపాలని వాళ్ళ నెంబర్లు ఇచ్చి మరీ ఉత్తర్వులు జారీ చేయడం అభిమానుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.
ఈ ట్రీట్మెంట్ రజనీకాంత్ జైలర్ కు జరగలేదు. మనకు పవన్ మినహాయించి ఇంకే హీరోకు ఏపి సర్కారు ఆటంకాలు సృష్టించలేదు. దీంతో పవన్, విజయ్ ఫ్యాన్స్ పరస్పరం మద్దతు తెలుపుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. లియో మీద ముందు నుంచి రాజకీయ నీడలున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం, ఉదయనిధికి కోరుకున్న ప్రాంతాల పంపిణి హక్కులు దక్కపోవడం వల్లే ఇలా చేస్తున్నారనే కామెంట్స్ పరిశ్రమ వర్గాల్లో ఉన్నాయి. మొత్తానికి స్టార్ హీరోల సినిమాలకు పొలిటికల్ హీట్ తగిలితే దాని తాలూకు పరిణామాలు ఈ స్థాయిలో ఉంటాయనని మళ్ళీ ఋజువయ్యింది.
This post was last modified on October 17, 2023 11:08 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…