ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు మోస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతోంది. ఇవాళ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకోబోతున్న సందర్భంగా రెండు మూడు రోజులు బ్రేక్ ఇచ్చారు తప్పించి ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ కొనసాగబోతోంది. ఫస్ట్ పార్ట్ కన్నా చాలా టెర్రిఫిక్ ఎపిసోడ్స్ ని దర్శకుడు సుకుమార్ దీని కోసం ప్లాన్ చేశారు. ట్విస్టులు కూడా బోలెడుంటాయి. బన్నీ, ఫహద్ ఫాసిల్ మధ జరిగే యుద్ధం ఊహకందని స్థాయిలో డిజైన్ చేశారని యూనిట్ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది.
తాజాగా వచ్చిన లీక్ ప్రకారం ఇందులో బన్నీని చిరంజీవి వీరాభిమానిగా చూపిస్తున్నారట. ఇంద్ర సినిమా రిలీజైన టైంలో పుష్ప రాజ్ భార్య శ్రీవల్లిని థియేటర్ కు తీసుకొచ్చి సినిమా చూపించే సన్నివేశం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. ఇక్కడే హత్య ప్రయత్నం జరిగే సీన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని వినికిడి. అంటే తెరమీద ఇంద్రసేనారెడ్డి ఫ్యాక్షనిజంకి పుష్ప చేయబోయే అల్లరి ప్లస్ వయొలెన్స్ భారీగా చూడొచ్చన్న మాట. పుష్ప 1లోనూ రష్మిక మందన్నకు బన్నీ చూడాలని ఉంది సినిమా టికెట్లు ఇప్పించే ట్రాక్ బాగానే పేలడం గుర్తేగా.
ఇలాంటివి అధికారికంగా చెప్పరు కానీ లీకైన ఫోటోలు గట్రా చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి. 2024 ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 కి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగినంత సమయం దొరికేలా సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటి భాగం రీ రికార్డింగ్ విషయంలో జరిగిన పొరపాట్లు, వచ్చిన ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని ఈసారి దేవిశ్రీ ప్రసాద్ కి తగినంత టైం దొరికేలా చూస్తున్నారు. అన్ని ప్లాన్ ప్రకారమే జరిగిపోయి జూన్ కంతా సెన్సార్ కాపీ సిద్ధం చేయొచ్చు. జూలై మొత్తం నెల రోజులు పూర్తిగా ఇండియా వైడ్ ప్రమోషన్స్ కోసం టూర్ డిజైన్ చేస్తారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…