సగటు మధ్య తరగతి జనాలకు థియేటర్ సినిమా మరీ అందని ద్రాక్షగా మారిపోతోంది. ఏదో పెద్ద హీరో బొమ్మ లేదా విజువల్ గ్రాండియర్ అయితే తప్ప అదే పనిగా కుటుంబాలను తీసుకుని హాలుకు వెళ్లే పరిస్థితి లేదు. అక్టోబర్ 13 జాతీయ చలనచిత్ర దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సులు రోజు మొత్తం ఏ షో అయినా సరే కొత్త పాత తేడా లేకుండా ప్రతి సినిమాకు టికెట్ ధర కేవలం 99 రూపాయలు పెట్టడం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఎప్పుడో నెల క్రితం వచ్చిన జవాన్ అడ్వాన్స్ బుకింగ్ లోనే 3 లక్షల పై చిలుకు టికెట్లు అమ్మడం షాక్ కలిగించే విషయం.
తెలుగులో మ్యాడ్ లాంటి చిన్న బడ్జెట్ హిట్ సినిమాలు ఈ స్కీం వల్ల బ్రహ్మాండంగా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇవాళ అన్ని భాషలు కలిపి సుమారు పదిహేను పైగా కొత్త రిలీజులున్నాయి. స్టార్ హీరోలు లేనివి కాబట్టి తక్కువ ధర అనే ఉద్దేశంతో వస్తున్న ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నప్పటికీ ఏడాది గడిచే కొద్దీ ఆక్యుపెన్సీలు భారీగా నమోదవుతున్నాయి. రెండు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా నగరాల్లో మల్టీప్లెక్స్ రేట్లు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇంత భారీ డిస్కౌంట్ అంటే జనం ఎగబడకుండా ఉంటారా.
ఇకనైనా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మొదటి వారం పది రోజులు మినహాయించి మహేష్ బాబు లాంటి పెద్ద హీరోకు, సంపూర్ణేష్ బాబు లాంటి చిన్న హీరోకు ఒకటే రేట్ పెట్టడం పబ్లిక్ ని ప్రభావితం చేస్తోంది. చిన్న సినిమాలు చితికిపోతోంది కేవలం ఈ కారణంగానే. వీకెండ్ కాకుండా కనీసం మాములు రోజుల్లో అయినా తగ్గించేలా చర్యలు తీసుకుంటే బాగుండేది. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో ఈ తగ్గింపు 112 రూపాయలకు పరిమితం కాగా ఆంధ్రప్రదేశ్ లో నిబంధనల కారణంగా ఏ డిస్కౌంట్లు లేక అక్కడ మాత్రం రెగ్యులర్ రేట్లే ఉన్నాయి.
This post was last modified on October 13, 2023 1:49 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…