రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భయంకర పరిస్థితిలో ఉన్నారని ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కలుషిత నీరు, దోమలు, వెంటిలేషన్ లేకపోవడం వంటి కారణంగా చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల తమ కుటుంబం ఆందోళనగా ఉందన్నారు. కుట్ర పూరితంగానే చంద్రబాబును జైల్లో నిర్బంధించారని విమర్శించారు.
ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వం కూడా చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వాస్తవాలను దాస్తున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్ దే బాధ్యతని తేల్చి చెప్పారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్(ఎక్స్) చేశారు. ఇదిలావుంటే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి, కుమారుడు, కోడలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తన భర్త ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఇన్ఫెక్షన్, అలర్జీతో చంద్రబాబు బాధపడుతున్నారని, అపరిశుభ్ర జైలులో నిర్బంధించడం హృదయ విదారమని అన్నారు. మరోవైపు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాబు ఆరోగ్యంపై కుటుంబమంతా తీవ్ర ఆందోళనతో ఉందని తెలిపారు. ఇదిలావుంటే, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు(శుక్రవారం) జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్టు చేశారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…