రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భయంకర పరిస్థితిలో ఉన్నారని ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కలుషిత నీరు, దోమలు, వెంటిలేషన్ లేకపోవడం వంటి కారణంగా చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల తమ కుటుంబం ఆందోళనగా ఉందన్నారు. కుట్ర పూరితంగానే చంద్రబాబును జైల్లో నిర్బంధించారని విమర్శించారు.
ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వం కూడా చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వాస్తవాలను దాస్తున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్ దే బాధ్యతని తేల్చి చెప్పారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్(ఎక్స్) చేశారు. ఇదిలావుంటే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి, కుమారుడు, కోడలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తన భర్త ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఇన్ఫెక్షన్, అలర్జీతో చంద్రబాబు బాధపడుతున్నారని, అపరిశుభ్ర జైలులో నిర్బంధించడం హృదయ విదారమని అన్నారు. మరోవైపు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాబు ఆరోగ్యంపై కుటుంబమంతా తీవ్ర ఆందోళనతో ఉందని తెలిపారు. ఇదిలావుంటే, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు(శుక్రవారం) జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్టు చేశారు.
This post was last modified on October 13, 2023 4:54 pm
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…