Trends

పిల్ల‌ల్ని క‌నండి.. చైనా గ‌గ్గోలు!!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌న చైనాగా ఉన్న డ్రాగ‌న్ కంట్రీ.. ఇప్పుడు జ‌నాభా సంఖ్య ఎంతున్నా ఫ‌ర్లేదు.. పిల్లల్ని క‌నండి అంటూ ఇంటింటి ప్ర‌చారం ప్రారంభించింది. అంతేకాదు.. గ‌ర్భ నిరోధ‌కాల్లో ఒక‌టైన‌ కండోమ్‌ల విక్ర‌యంపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. మ‌రి దీనికి కార‌ణాలేంటి? చైనా స‌ర్కారు హ‌ఠాత్తుగా ఇంత క‌టిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది.

వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం వ‌రకు కూడా చైనానే ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశం. ఈ ర్యాంకు ను భార‌త్ కొట్టేసింది. ఇప్పుడు 140 కోట్ల పైచిలుకు జ‌నాభాతో భార‌త్ ముందంజ‌లో ఉంది. అయితే.. చైనా ఇప్పుడు కొన్నాళ్లుగా అక్క‌డి పౌరుల‌ను పిల్ల‌ల్ని కనండి అంటూ.. గ‌గ్గోలు పెడుతోంది. దీనికి కార‌ణం.. జ‌నాభా విష‌యంలో భార‌త దేశం త‌మ‌ను దాటేసినందుకు కాదు.. భ‌విష్య‌త్తును త‌లుచుకుంటే గుండె క‌రిగి పోతున్నందుకేన‌ట‌.

ఔను. అత్య‌ధిక జ‌నాభా ఉన్న కార‌ణంగా గ‌తంలో చైనా పాల‌కులు తీసుకున్న కొన్నినిర్ణ‌యాలు.. జ‌నాభా సంఖ్య‌ను భారీగా క‌ట్ట‌డి చేశాయి. 1980 నుంచి 2015 దాకా ఆ దేశంలో పెళ్లయిన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసింది. దీంతో జనాభా అసమతుల్యత పెరిగిపోయింది. ఈ విష‌యం తెలియగానే ఒక బిడ్డ‌ విధానానికి చైనా స్వస్తి పలికింది.

ఈ క్ర‌మంలోనే జనాభా రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కొత్తగా పిల్లల ను కనేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించింది. అయినా ప్రస్తుతానికైతే పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మ‌రోవైపు.. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. 2040 నాటికి చైనాలో 65 శాతం మంది వృద్ధులే ఉండ‌నున్నార‌ని తాజాగా స‌ర్కారు లెక్క‌లు వేసింది. ఇదే జ‌రిగితే.. త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ త‌ల‌కిందులు కావ‌డంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా చైనా ప‌రిస్థితి డోలాయ‌మానంలోనూ ప‌డ‌నుంది.

దీంతో యువత సంఖ్య‌ను 2040 నాటికి పెంచే కీల‌క చ‌ర్య‌ల‌కు చైనా ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. ఒక‌ప్పుడు ఒక్క బిడ్డే అన్న ప్ర‌భుత్వం ఇప్పుడు ఎంత మందినైనా క‌నండి అంటూ బిగ్ ఆఫ‌ర్ ఇచ్చింది. అంతేకాదు.. కొత్త పెళ్ల‌యిన వారికి పిల్ల‌లు క‌నడంపై కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఉద్యోగులు అయితే.. భారీగా సెల‌వులు కూడా ఇస్తున్నారు. ఇక‌, గ‌ర్భ నిరోధ‌కాల్లో ఒక‌టైన కండోమ్‌ల వినియోగంపై ఉక్కుపాదం మోపారు. వాటిని కొనుగోలు చేయాలంటే డాక్ట‌ర్ అనుమ‌తి ఉండాల‌ని తాజాగా స‌ర్కారు నిబంధ‌న విధించింది. మొత్తంగా.. చైనాలో ఇప్పుడు బిడ్డుల‌ను క‌న‌డంపై స‌ర్కారు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌డం ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.

This post was last modified on October 13, 2023 12:25 pm

Share

Recent Posts

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

50 minutes ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

2 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

6 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

7 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

7 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

7 hours ago