థియేటర్ లో వేసే ఏ కంటెంట్ అయినా అది పబ్లిక్ ఎగ్జిబిషన్ కిందకే వస్తుంది. సెన్సార్ సర్టిఫికెట్ తీసుకుని మాత్రమే ప్రదర్శించాలి. ఏ మాత్రం అలసత్వం వహించినా చట్టపరమైన చర్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఆ మధ్య నాగార్జున పుట్టినరోజుకి నా సామి రంగాని ఈ కారణంగా కేవలం ఆన్ లైన్ కే పరిమితం చేయాల్సి వస్తుంది. అయితే లియో విషయంలో కొందరు ఎగ్జిబిటర్లు చూపించిన అత్యుత్సాహం ఏకంగా లీగల్ నోటీసులు అందుకునేలా చేసింది. మూడు రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ ని తమిళనాడులోని పలు థియేటర్లలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నేరుగా పబ్లిక్ స్క్రీనింగ్ చేశారు.
అందులో ఓ అభ్యంతకర పదం, హింసాత్మక దృశ్యాలు యధాతథంగా వచ్చేశాయి. ఇది కాస్తా సెన్సార్ బోర్డు దృష్టికి వెళ్ళింది. తమ అనుమతి లేకుండా ఎలా ప్రదర్శిస్తారని వివరణ కోరుతూ కోర్టు నోటీసులు పంపింది. దెబ్బకు షాక్ తిన్న యాజమాన్యాలు వివరణ ఎలా ఇవ్వాలనే దాని మీద తర్జన భర్జన పడుతున్నాయి. వేయలేదని తప్పించుకోవడానికి లేదు. ట్రైలర్ వేసిన టైంలో అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వాటినే సాక్ష్యాలుగా న్యాయస్థానం తీసుకోవడంతో థియేటర్ ఓనర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్స్ డిమాండ్ చేశారనో లేదా క్రేజ్ వస్తుందనో ముందు వెనుకా చూసుకోకుండా రెండు నిమిషాల ట్రైలర్లు వేస్తే ఇదిగో ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 2 గంటల 45 నిమిషాల నిడివితో ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న లియోకి సంబంధించిన చాలా వార్తలు పుకార్ల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ క్యామియో మీద పెద్ద చర్చే జరుగుతోంది. యూనిట్ నుంచి వచ్చిన లీక్ టాక్ అదేమీ లేదని చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఉంటుందనే నమ్ముతున్నారు. ఇంకో తొమ్మిది రోజులు దాని సంగతేంటో కూడా తేలిపోతుంది.
పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…
ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…
ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…