ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా.. తెరపై గ్లామరస్గా కనిపిస్తుందే తప్ప విపరీతంగా ఎక్స్పోజింగ్ ఏమీ చేయదు. ఇంటిమేట్ సీన్లు కూడా పెద్దగా చేసింది లేదు. ఒక్క విజయ్ దేవరకొండతో మాత్రమే ఆమె లిప్ లాక్ సీన్లలో నటించింది. ‘గీత గోవిందం’తో పాటు ‘డియర్ కామ్రేడ్’లోనూ ఆమె ఈ సీన్లలో నటించింది. వేరే చిత్రాల్లో అలా నటించాల్సిన అవసరం రాలేదా.. లేక రష్మికనే వాటికి ఒప్పుకోలేదా అన్నది తెలియదు.
అలాంటి హీరోయిన్ సందీప్ రెడ్డి వంగా కొత్త చిత్రం ‘యానిమల్’లో నటిస్తోందంటేనే ఇందులో ఇంటిమేట్ సీన్లు ఉంటే ఓకే చేస్తుందా అన్న క్యూరియాసిటీ కలిగింది యువ ప్రేక్షకుల్లో. సందీప్ తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’లో లిప్ లాక్స్ మోత మోగిపోయిన సంగతి తెలిసిందే. పైగా ఈసారి అతను చేస్తోంది బాలీవుడ్ మూవీ. అందులోనూ రొమాంటిక్ కింగ్ రణబీర్ కపూర్ హీరో. దీంతో కచ్చితంగా ఇందులో ఇంటిమేట్ సీన్లు ఉంటాయనే అభిప్రాయం కలిగింది.
పైగా సినిమాలో ఒక వయొలెంట్ ఫస్ట్ నైట్ సీన్ ఉంటుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది ఈ మధ్య. ఇలాంటి టైంలో ‘యానిమల్’ నుంచి తొలి పాటను అనౌన్స్ చేశారు ఈ రోజు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా వదిలారు. అందులో రణబీర్తో లిప్ లాక్ చేస్తూ కనిపించింది రష్మిక. విజయ్ తర్వాత ఆమె లిప్ లాక్ చేస్తోంది రణబీర్తోనే.
సందీప్ సినిమాల్లో ఎలాంటి సన్నివేశం అయినా గాఢత ఎక్కువ ఉంటుంది. రొమాన్స్ అయితే ఇంకా ఘాటుగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. తొలి పాటతోనే లిప్ లాక్ పోస్టర్ వదిలారంటే సినిమాలో కూడా ఘాటు రొమాన్స్ తప్పక ఉంటుందనే అభిప్రాయం కలుగుతోంది. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా జరుగుతున్న ‘వయొలెంట్ ఫస్ట్ నైట్’ ప్రచారం నిజమే అనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తే. కాబట్టి రష్మికను హాట్ హాట్గా చూడాలనుకునే కుర్రాళ్లకు పండగ అన్నమాటే.
This post was last modified on October 10, 2023 3:29 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…