ప్రభాస్ లోకేష్ చాలా ఓపిక పట్టాలి

కోలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ లియో ప్రమోషన్ల కోసం ఇస్తున్న ఇంటర్వ్యూలలో భాగంగా ప్రభాస్ తో సినిమా ఉండొచ్చనే సంకేతం మరోసారి ఇచ్చాడు. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఖైదీ లాంటి సింగల్ నైట్ మూవీలో కార్తీతోనే ఓ రేంజ్ హీరోయిజం పండించి ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ లతో అమాంతం స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ లోకేష్ ల కలయిక కార్యరూపం దాల్చడానికి ఊహించనంత పెద్ద టైం పడుతుంది.

అదెలాగో చూద్దాం. లోకేష్ కనగరాజ్ లియో విడుదలయ్యాక అయిదారు నెలలు రజనీకాంత్ 171 స్క్రిప్ట్ మీద పని చేయబోతున్నాడు. అది సంతృప్తి కలిగే దాకా ఒకటి రెండు నెలలు ఎక్స్ ట్రా కూడా అవ్వొచ్చు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వగైరాలు ఎంతలేదన్నా 2024 చివరికి వస్తుంది.  ఆ తర్వాత ఖైదీ 2 కన్ఫర్మ్ గా తీస్తానని బల్లగుద్ది చెబుతున్నాడు. ఆపై విక్రమ్ 2 కోసం కమల్ హాసన్ రెడీ అవుతారు. దీనికి కథ ఉంది కానీ ఫుల్ వెర్షన్ డెవలప్ చేయాలి. వీటితో పాటు రోలెక్స్ ని సోలో క్యారెక్టర్ గా మార్చి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. వీటన్నింటిని లోకేష్ యునివర్స్ పేరుతో ముడిపెడతాడు.

ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేసరికి 2028 వస్తుంది. ఆలోగా ప్రభాస్ కల్కి 2, సలార్ 2, మారుతీ సినిమా, సందీప్ వంగా స్పిరిట్ ఫినిష్ చేసుకుని లోకేష్ కోసం ఫ్రీ అవ్వాలి. తనకన్నా ముందు హను రాఘవపూడి వెయిటింగ్ లో ఉన్నాడు. మధ్యలో జరిగే ఆలస్యాలు, వాయిదా పర్వాలు కొత్తగా చెప్పడానికి లేదు. సో ఇవన్నీ లెక్కలేసుకుని చూస్తే 2030 దగ్గరగా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఏదైనా అనూహ్య పరిణామం తలెత్తితే తప్ప ముందే మొదలు కావడం అసాధ్యం. సో ఫ్యాన్స్ ప్రాక్టికల్ గా అలోచించి కూల్ అవ్వాల్సింది తప్ప ఏదో ఒకటి రెండు సంవత్సరాలలో ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే.