కొన్ని క్లాసిక్స్ ఎన్ని సంవత్సరాలు గడిచినా అలా గుర్తుండిపోతాయి. వాటిలో ఒకటి 2007లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ అప్పట్లో అంచనాలకు మించి ఆడింది. ముందు ఒక భాషలో తీసి చూద్దామనుకుని తెలుగులో విడుదల చేస్తే దానికొచ్చిన స్పందన చూసి మరుసటి ఏడాదే ధనుష్ తో తమిళంలో రీమేక్ చేశారు. ఆ తర్వాత బెంగాలీ, భోజ్ పూరి, కన్నడ, ఒడియా తదితర లాంగ్వేజెస్ లో పునః నిర్మితం చేశారు. ఎన్ని వచ్చినా వెంకీ వెర్షనే అన్నింటిలోకి చాలా స్పెషల్ అండ్ ఒరిజినల్ అనిపిస్తుంది.
ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణముంది. 2013లో దర్శకుడు సెల్వ రాఘవన్ ఒక ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చూశానని, వెంకటేష్ త్రిషలతో పని చేయడం గొప్పగా ఉందని, సీక్వెల్ చేస్తే బాగుంటుందని అందులో పేర్కొన్నారు. సరిగ్గా పదేళ్ల తర్వాత త్రిషకు ఏం గుర్తొచ్చిందో ఏమో కానీ ఇప్పుడు సమాధానమిస్తూ నేను సిద్ధంగా ఉన్నానని రీట్వీట్ చేశారు. అదేదో అప్పుడే చెప్పి కొనసాగింపు తీయించి ఉంటే బాగుండేది కదానే అభిప్రాయం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది. ఎలాగూ యువన్ శంకర్ రాజాతో సహా టీమ్ మొత్తం అందుబాటులో ఉంది.
వినడానికి బాగానే ఉన్న ఇప్పుడా క్లాసిక్ కంటిన్యూ చేయడం సులభం కాదు. ఎందుకంటే సెల్వ రాఘవన్ నటనతో పాటు యుగానికి ఒక్కడు 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతకు ముందులా వేగంగా సినిమాలు తీయడం లేదు. వెంకటేష్ అడిగితే నో చెప్పరు కానీ అసలు కథంటూ చేతిలో ఉండాలిగా. ఇదేమో కానీ ఒకవేళ రీ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. వెంకీ కోట మధ్య ఎమోషన్, త్రిష అందం, సెకండ్ హాఫ్ లో విశ్వనాథ్ కుటుంబం కామెడీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని కంటెంట్ ఇది. థియేటర్లలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on September 11, 2023 10:56 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…