హీరోలకే కాదు సంగీత దర్శకులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కొత్త కాదు. ప్రత్యక్షంగా వాళ్ళను చూస్తూ పాటలు వినే అవకాశం దాన్ని ఎవరూ వదులుకోరు. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని స్వంతం చేసుకోవాలనుకుంటారు. కానీ నిర్వాహకులు ఘనకార్యాల వల్ల కొన్నిసార్లు ఇవి శృతి తప్పి మర్చిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నిన్న చెన్నైలో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ ఒకటి ‘మరుక్కుమ నెంజమ్’ పేరుతో ఏర్పాటు చేశారు. ప్రమోషన్లు భారీగా జరగడంతో టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి.
ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉన్నా సరే దాన్ని లెక్క చేయకుండా ప్రోగ్రాంకు వచ్చిన వందలాది ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపడేలా చేశారు. వేల రూపాయలు పోసి టికెట్లు కొన్నవాళ్లకు సీట్లు లేకపోవడంతో ఉసూరుమని వెనక్కు తిరగడం తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. పోనీ లోపల ఉన్న వాళ్ళకైనా ఏమైనా సంతోషం మిగిలిందా అంటే అదీ లేదు. సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, వెనక కూర్చున్న వాళ్లకు వినిపించకపోవడం లాంటి లోపాల వల్ల కార్యక్రమం పూర్తి కాకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ కోపాన్ని పబ్లిక్ గానే ప్రదర్శించారు
ఇది చెన్నైలోని పనియుర్ ప్రాంతంలో ఉన్న ఆదిత్యరామ్ పాలస్ లో నిర్వహించారు. సుమారు 50 వేలకు పైగా హాజరైతే వాళ్లకు సరిపడా వసతులు సమకూర్చడంలో వేడుక ఆర్గనైయిజర్స్ ఏవిటిసి ఈవెంట్స్ ఘోరంగా ఫెయిలవ్వడంతో రద్దీని అదుపు చేయలేక ఒకదశలో పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. ఇంతకన్నా పెద్ద స్థాయిలో ఓపెన్ స్టేడియంలో ఇళయరాజా, రెహమాన్, ఎస్పిబిలు లైవ్ ఇచ్చినప్పుడు రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు నిర్వాహకుల దగ్గర సమాధానం లేదు. దీనికి స్కామ్ 2023 అని పేరు పెట్టి ట్విట్టర్ లో ట్రెండింగ్ కూడా చేయడం గమనార్హం.
This post was last modified on September 11, 2023 10:24 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…