హీరోలకే కాదు సంగీత దర్శకులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కొత్త కాదు. ప్రత్యక్షంగా వాళ్ళను చూస్తూ పాటలు వినే అవకాశం దాన్ని ఎవరూ వదులుకోరు. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని స్వంతం చేసుకోవాలనుకుంటారు. కానీ నిర్వాహకులు ఘనకార్యాల వల్ల కొన్నిసార్లు ఇవి శృతి తప్పి మర్చిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నిన్న చెన్నైలో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ ఒకటి ‘మరుక్కుమ నెంజమ్’ పేరుతో ఏర్పాటు చేశారు. ప్రమోషన్లు భారీగా జరగడంతో టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి.
ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉన్నా సరే దాన్ని లెక్క చేయకుండా ప్రోగ్రాంకు వచ్చిన వందలాది ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపడేలా చేశారు. వేల రూపాయలు పోసి టికెట్లు కొన్నవాళ్లకు సీట్లు లేకపోవడంతో ఉసూరుమని వెనక్కు తిరగడం తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. పోనీ లోపల ఉన్న వాళ్ళకైనా ఏమైనా సంతోషం మిగిలిందా అంటే అదీ లేదు. సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, వెనక కూర్చున్న వాళ్లకు వినిపించకపోవడం లాంటి లోపాల వల్ల కార్యక్రమం పూర్తి కాకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ కోపాన్ని పబ్లిక్ గానే ప్రదర్శించారు
ఇది చెన్నైలోని పనియుర్ ప్రాంతంలో ఉన్న ఆదిత్యరామ్ పాలస్ లో నిర్వహించారు. సుమారు 50 వేలకు పైగా హాజరైతే వాళ్లకు సరిపడా వసతులు సమకూర్చడంలో వేడుక ఆర్గనైయిజర్స్ ఏవిటిసి ఈవెంట్స్ ఘోరంగా ఫెయిలవ్వడంతో రద్దీని అదుపు చేయలేక ఒకదశలో పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. ఇంతకన్నా పెద్ద స్థాయిలో ఓపెన్ స్టేడియంలో ఇళయరాజా, రెహమాన్, ఎస్పిబిలు లైవ్ ఇచ్చినప్పుడు రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు నిర్వాహకుల దగ్గర సమాధానం లేదు. దీనికి స్కామ్ 2023 అని పేరు పెట్టి ట్విట్టర్ లో ట్రెండింగ్ కూడా చేయడం గమనార్హం.
This post was last modified on September 11, 2023 10:24 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…