టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, తదనంతరం రిమాండు.. అంశాలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ఇవే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంచలనం కాగా, ఇప్పుడు చంద్రబాబును అర్థరాత్రి రాజమండ్రి జైలుకు తరలించడం.. ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా వాదనలు వంటివి.. జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
అంతేకాదు.. అసలు స్కిల్ డెవలప్మెంటు కేసు పూర్వాపరాలు సహా.. అసలు ఏం జరిగింది? అనే అంశాల పైనా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అదేసమయంలో 73 ఏళ్ల వయసులో దేశంలో తొలిసారి ఒక మాజీ సీఎంను అరెస్టు చేశారంటూ హిందూ పత్రిక వ్యాసం ప్రచురించగా, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పత్రికలు కూడా.. ప్రముఖంగా చంద్రబాబు కథనాన్ని తొలి పేజీలోనే ప్రచురించాయి. అయితే, ఏం జరిగింది? అనే విషయంపై మాత్రం చాలా ఆచితూచి వ్యవహరించడం గమనార్హం.
కొన్ని పొరుగు రాష్ట్రాల పత్రికల్లోనూ చంద్రబాబు అరెస్టును నాటి తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అరెస్టును తలపించేలా జరిగిందని పేర్కొనడం విశేషం. అయితే.. రాజకీయ కక్ష సాధింపు చర్యగా దీనిని కొన్ని పత్రికలు పేర్కొనగా… ఏం జరిగిందనేది ఆసక్తిగా మారిందని మరికొన్ని పత్రికలు పత్రికలు పేర్కొన్నాయి. ఏదేమైనా అన్ని రాష్ట్రాల ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో చంద్రబాబు అరెస్టు, రిమాండు వార్త ప్రముఖంగా రావడం గమనార్హం.
ఇక, అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. ముఖ్యంగా ‘ది సింగపూర్ టైమ్స్’, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు చంద్రబాబు అరెస్టు సహా.. ఆయనకు ఉన్న ఇమేజ్, అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన పాత్ర వంటివి ప్రధానంగా స్పృశించాయి. మొత్తంగా స్థానిక మీడియా కంటే కూడా.. భారీ ఎత్తున అంతర్జాతీయ, జాతీయ మీడియాలు సైతం చంద్రబాబువార్తకు ప్రాధాన్యం ఇచ్చాయి.
This post was last modified on September 11, 2023 12:59 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…