పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. తమిళ సినిమాల్లో తమిళ నటులు, టెక్నీషియన్లకు మాత్రమే అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల రోజా భర్త, సీనియర్ దర్శకుడు సెల్వమణి నేతృత్వంలోని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సి) పెట్టిన కొత్త రూల్స్ గురించి పవన్ ఈ వేడుకలో మాట్లాడాడు.
ఇలా సంకుచిత ధోరణితో ఉంటే సినీ పరిశ్రమ ఎదగదని.. అన్ని భాషల వాళ్లనూ కలుపుకుని వెళ్తేనే ముందడుగు వేయగలమని.. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శమని పవన్ వ్యాఖ్యానించాడు. దీనిపై తమిళుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ కోలీవుడ్కు నీతులు చెప్పాల్సిన పని లేదని కొందరంటే.. తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూసే తెలుగు సినీ పరిశ్రమను ముందు దారిన పెట్టుకోవాలంటూ పవన్కు కొందరు కౌంటర్లు వేశారు.
ఐతే పవన్తో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. పవన్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు. పవన్ పేరు ఎత్తి ఆయన మీదేమీ విమర్శలు చేయలేదు కానీ.. తమిళ పరిశ్రమ ఇతర భాషా నటీనటులను, టెక్నీషియన్లను దూరం పెడుతుందనే వాదనను ఆయన తప్పుబట్టారు.
అన్ని భాషల వాళ్లనూ అక్కున చేర్చుకునే పరిశ్రమ కోలీవుడ్ అని.. దశాబ్దాల కిందటే ఎస్వీఆర్, సావిత్రి లాంటి తెలుగు ఆర్టిస్టులు తమిళ సినిమాల్లో ఒక వెలుగు వెలిగారని.. తర్వాత కూడా ఎంతోమంది పరభాషా నటీనటులు, టెక్నీషియన్లకు కోలీవుడ్ అవకాశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. కోలీవుడ్ గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. ఎవరూ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే ఫెఫ్సి పెట్టిన రూల్స్తో ఇండస్ట్రీకి సంబంధం లేదని.. ఇక్కడ అలాంటి షరతులేమీ లేవని నాజర్ చెప్పకనే చెబుతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on October 8, 2023 4:35 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…