పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. తమిళ సినిమాల్లో తమిళ నటులు, టెక్నీషియన్లకు మాత్రమే అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల రోజా భర్త, సీనియర్ దర్శకుడు సెల్వమణి నేతృత్వంలోని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సి) పెట్టిన కొత్త రూల్స్ గురించి పవన్ ఈ వేడుకలో మాట్లాడాడు.
ఇలా సంకుచిత ధోరణితో ఉంటే సినీ పరిశ్రమ ఎదగదని.. అన్ని భాషల వాళ్లనూ కలుపుకుని వెళ్తేనే ముందడుగు వేయగలమని.. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శమని పవన్ వ్యాఖ్యానించాడు. దీనిపై తమిళుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ కోలీవుడ్కు నీతులు చెప్పాల్సిన పని లేదని కొందరంటే.. తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూసే తెలుగు సినీ పరిశ్రమను ముందు దారిన పెట్టుకోవాలంటూ పవన్కు కొందరు కౌంటర్లు వేశారు.
ఐతే పవన్తో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. పవన్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు. పవన్ పేరు ఎత్తి ఆయన మీదేమీ విమర్శలు చేయలేదు కానీ.. తమిళ పరిశ్రమ ఇతర భాషా నటీనటులను, టెక్నీషియన్లను దూరం పెడుతుందనే వాదనను ఆయన తప్పుబట్టారు.
అన్ని భాషల వాళ్లనూ అక్కున చేర్చుకునే పరిశ్రమ కోలీవుడ్ అని.. దశాబ్దాల కిందటే ఎస్వీఆర్, సావిత్రి లాంటి తెలుగు ఆర్టిస్టులు తమిళ సినిమాల్లో ఒక వెలుగు వెలిగారని.. తర్వాత కూడా ఎంతోమంది పరభాషా నటీనటులు, టెక్నీషియన్లకు కోలీవుడ్ అవకాశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. కోలీవుడ్ గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. ఎవరూ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే ఫెఫ్సి పెట్టిన రూల్స్తో ఇండస్ట్రీకి సంబంధం లేదని.. ఇక్కడ అలాంటి షరతులేమీ లేవని నాజర్ చెప్పకనే చెబుతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on October 8, 2023 4:35 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…