మొన్నేమో ఒక నటుడు సినిమా రివ్యూలు రాసే రైటర్ల మీద విరుచుకుపడ్డాడు. మీరు సినిమా తీసి తర్వాత రివ్యూలు రాయండి అన్నాడు లాజిక్ లేకుండా. ఇక ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా బాలేదు అంటూ సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్టు పెడితే చాలు.. సదరు హీరో ఫ్యాన్స్ బూతులు అందుకుంటారు. అదే పనిగా సినిమాను టార్గెట్ చేయడం, బావున్న సినిమాను బాలేదని అనడం తప్పే కానీ.. బాలేని సినిమా మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించడం కూడా తప్పయిపోతోంది.
కొత్త సినిమా రిలీజైనపుడల్లా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో ముందుగా షోలు పడుతుంటాయి. షోలు అవ్వగానే బయట మైకులు పట్టుకుని మీడియా వాళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు సిద్ధంగా ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఆ మైకుల ముందు అవాకులు చెవాకులు పేలే వాళ్లు, అనవసర హంగామా చేసేవాళ్లు ఎలాగూ ఉంటారు.
వాళ్లకు తోడు జెన్యూన్గా తమ అభిప్రాయం చెప్పే సగటు ప్రేక్షకులు కూడా ఉంటారు. ఈ శుక్రవారం ఉదయం ‘ఆదిపురుష్’ షో అనంతరం ఒక కుర్రాడు సినిమా బాలేదంటూ తన అభిప్రాయం చెబుతుంటే.. పక్కనే ఉన్న ప్రభాస్ అభిమానులకు కోపం వచ్చింది. నువ్వసలు సినిమా చూశావా.. ఎలా చూశావసలు.. సినిమా బాలేదని ఎలా అంటావు అంటూ తనతో గొడవకు దిగారు.
ఆ కుర్రాడు వాళ్లకు దీటుగానే బదులిచ్చాడు. టికెట్ కొని సినిమా చూశా.. నా అభిప్రాయం నేను చెబుతానంటూ వారితో వాదించాడు. ఈ మాటలు రుచించని ప్రభాస్ ఫ్యాన్స్ ఆ కుర్రాడి మీద దాడికి దిగారు. మీడియా కెమెరాల ముందే అతడిపై దాడి జరిగింది. ఈ వీడియో నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సినిమా బాలేదంటే కొట్టడం ఏంటి.. ఎవరి అభిప్రాయం వాళ్లది కదా.. ఇదేం సంప్రదాయం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ను నెటిజన్లు తప్పుబడుతున్నారు.
This post was last modified on June 16, 2023 5:17 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…