మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా బ్రో డాడీ రీమేకనే వార్త రెండు నెలల క్రితమే మొదలయ్యింది. ప్రాజెక్టు అఫీషియల్ గా మొదలుకాలేదు కాబట్టి యూనిట్ సభ్యులెవరూ దీని గురించి స్పందించలేదు. దీంతో నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. దీంతో స్వయానా మెగా ఫ్యాన్సే ఇంకెన్ని రీమేకులు చేస్తారు చిరు అంటూ నిలదీయడం మొదలుపెట్టారు. ఎప్పుడో ఓటిటిలో వచ్చిన మలయాళం బొమ్మ తప్ప ఇంకేం దొరకలేదానేది వాళ్ళ ఆవేదన. అందులో న్యాయముంది
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది ఖచ్చితంగా బ్రో డాడీ రీమేక్ కాదట. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఏడాది క్రితమే చిరంజీవిని పర్సనల్ గా కలిసి ఈ కథను ఓకే చేయించుకున్నాడని, కాకపోతే దర్శకుడు సెట్ అయ్యేలోపు కాస్త సమయం పట్టిందని, అంతే తప్ప బ్రో డాడీ ఛాయలు నామమాత్రం కూడా ఉండవని అంటున్నారు. సిద్దు జొన్నలగడ్డ శ్రీలీల ఇంకో యూత్ పెయిర్ గా నటించబోయే ఈ ఎంటర్ టైనర్ లో ఘరానా మొగుడు లాంటి మాస్ కామెడీ పాటు అన్ని కమర్షియల్ అంశాలు మేళవించి తీర్చిదిద్దుతారట. ఫైనల్ నెరేషన్ ఇంకో రెండు మూడు వారాల్లో ఉండబోతోంది
సో అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చు. నిజానికి ఒక టైంలో చిరు బ్రో డాడీ మీద మనసు పడిన మాట వాస్తవమే. మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ ఆయన కొడుకుగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా అది. కానీ వయసు మళ్ళాక తండ్రయ్యే పాత్రలో నటిస్తే కనక లేనిపోని ట్రోలింగ్ కి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుందని గుర్తించే చిరు ఆ ఆలోచన మానుకున్నట్టు మెగా కాంపౌండ్ న్యూస్. కాబట్టి ఏ కోణంలో చూసినా బ్రో డాడీ రీమేక్ వట్టి పుకారనే క్లారిటీ వచ్చేసింది. భోళా శంకర్ రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది
This post was last modified on June 16, 2023 5:24 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…