‘బాహుబలి’ ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ అయ్యాక రాజమౌళిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లు ఉన్నారు. ఆయన్ని చూసి అసూయ చెందిన వాళ్లున్నారు. అలాగే ఏముంది ఆయన గొప్పదనం అంటూ తీసిపడేసిన వాళ్లూ లేకపోలేదు. ఈ మూడు వర్గాల వాళ్లూ సినిమాలు తర్వాత సినిమాలు తీశారు. కానీ వారిలో ఎవ్వరూ రాజమౌళి మ్యాజిక్ను మాత్రం రిపీట్ చేయలేకపోయారు.
ఇండియాలో బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ నుంచి గత ఎనిమిదేళ్లలో ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. వాటిలో ఒక్కటీ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఇక ఇండియాలో కంటెంట్ పరంగా తమ తర్వాతే ఎవరైనా అని ఫీలయ్యే కోలీవుడ్ సైతం ‘బాహుబలి’ తరహా భారీ ప్రయత్నాలు చేసి బోల్తా కొట్టింది. మిగతా ఇండస్ట్రీల వాళ్లు కూడా ‘ఎపిక్’ మూవీస్ ట్రై చేసి దెబ్బ తిన్నారు. ఇప్పుడు ఈ కోవలో నిరాశకు గురి చేసిన సినిమా ‘ఆదిపురుష్’.
‘బాహుబలి’ కథానాయకుడైన ప్రభాస్నే పెట్టి.. తానాజీ దర్శకుడు ఓం రౌత్ తీసిన ఈ చిత్రం.. బడ్జెట్, భారీతనం, ప్రి రిలీజ్ హైప్ పరంగా ‘బాహుబలి’ని మ్యాచ్ చేసేట్లు కనిపించింది. ఒకప్పుడు ఈ సినిమాపై ఎంతో నెగెటివిటీ కనిపించినప్పటికీ.. రిలీజ్ టైంకి అంతా సానుకూలంగానే కనిపించింది. హైప్ మామూలుగా లేదు. కానీ తెర మీద బొమ్మ పడ్డాక కథ మారిపోయింది. ప్రేక్షకుల అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయాడు ఓం రౌత్. సినిమాకు ఉన్న హైప్కి కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగేవి.
కానీ విజువలైజేషన్లో, విజువల్ ఎఫెక్ట్స్ను వాడుకోవడంలో, భావోద్వేగాలను పండించడంలో ఓం రౌత్ తేలిపోయాడు. ఈ విషయాల్లో రాజమౌళిని కొట్టేవాడు ఇండియాలో లేరనిమరోసారి రుజువైంది. ‘ఆదిపురుష్’ రిలీజ్ రోజు అందరూ జక్కన్నను తలుచుకుని తనకు తనే సాటి అని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎపిక్ మూవీస్ రాజమౌళికి వదిలేసి మామూలు సినిమాలు తీసుకోవాలని రౌత్ లాంటి దర్శకులకు సలహాలిస్తున్నారు.
This post was last modified on June 16, 2023 4:45 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…