‘బాహుబలి’ ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ అయ్యాక రాజమౌళిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లు ఉన్నారు. ఆయన్ని చూసి అసూయ చెందిన వాళ్లున్నారు. అలాగే ఏముంది ఆయన గొప్పదనం అంటూ తీసిపడేసిన వాళ్లూ లేకపోలేదు. ఈ మూడు వర్గాల వాళ్లూ సినిమాలు తర్వాత సినిమాలు తీశారు. కానీ వారిలో ఎవ్వరూ రాజమౌళి మ్యాజిక్ను మాత్రం రిపీట్ చేయలేకపోయారు.
ఇండియాలో బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ నుంచి గత ఎనిమిదేళ్లలో ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. వాటిలో ఒక్కటీ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఇక ఇండియాలో కంటెంట్ పరంగా తమ తర్వాతే ఎవరైనా అని ఫీలయ్యే కోలీవుడ్ సైతం ‘బాహుబలి’ తరహా భారీ ప్రయత్నాలు చేసి బోల్తా కొట్టింది. మిగతా ఇండస్ట్రీల వాళ్లు కూడా ‘ఎపిక్’ మూవీస్ ట్రై చేసి దెబ్బ తిన్నారు. ఇప్పుడు ఈ కోవలో నిరాశకు గురి చేసిన సినిమా ‘ఆదిపురుష్’.
‘బాహుబలి’ కథానాయకుడైన ప్రభాస్నే పెట్టి.. తానాజీ దర్శకుడు ఓం రౌత్ తీసిన ఈ చిత్రం.. బడ్జెట్, భారీతనం, ప్రి రిలీజ్ హైప్ పరంగా ‘బాహుబలి’ని మ్యాచ్ చేసేట్లు కనిపించింది. ఒకప్పుడు ఈ సినిమాపై ఎంతో నెగెటివిటీ కనిపించినప్పటికీ.. రిలీజ్ టైంకి అంతా సానుకూలంగానే కనిపించింది. హైప్ మామూలుగా లేదు. కానీ తెర మీద బొమ్మ పడ్డాక కథ మారిపోయింది. ప్రేక్షకుల అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయాడు ఓం రౌత్. సినిమాకు ఉన్న హైప్కి కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగేవి.
కానీ విజువలైజేషన్లో, విజువల్ ఎఫెక్ట్స్ను వాడుకోవడంలో, భావోద్వేగాలను పండించడంలో ఓం రౌత్ తేలిపోయాడు. ఈ విషయాల్లో రాజమౌళిని కొట్టేవాడు ఇండియాలో లేరనిమరోసారి రుజువైంది. ‘ఆదిపురుష్’ రిలీజ్ రోజు అందరూ జక్కన్నను తలుచుకుని తనకు తనే సాటి అని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎపిక్ మూవీస్ రాజమౌళికి వదిలేసి మామూలు సినిమాలు తీసుకోవాలని రౌత్ లాంటి దర్శకులకు సలహాలిస్తున్నారు.
This post was last modified on June 16, 2023 4:45 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…