‘బాహుబలి’ ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ అయ్యాక రాజమౌళిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లు ఉన్నారు. ఆయన్ని చూసి అసూయ చెందిన వాళ్లున్నారు. అలాగే ఏముంది ఆయన గొప్పదనం అంటూ తీసిపడేసిన వాళ్లూ లేకపోలేదు. ఈ మూడు వర్గాల వాళ్లూ సినిమాలు తర్వాత సినిమాలు తీశారు. కానీ వారిలో ఎవ్వరూ రాజమౌళి మ్యాజిక్ను మాత్రం రిపీట్ చేయలేకపోయారు.
ఇండియాలో బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ నుంచి గత ఎనిమిదేళ్లలో ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. వాటిలో ఒక్కటీ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఇక ఇండియాలో కంటెంట్ పరంగా తమ తర్వాతే ఎవరైనా అని ఫీలయ్యే కోలీవుడ్ సైతం ‘బాహుబలి’ తరహా భారీ ప్రయత్నాలు చేసి బోల్తా కొట్టింది. మిగతా ఇండస్ట్రీల వాళ్లు కూడా ‘ఎపిక్’ మూవీస్ ట్రై చేసి దెబ్బ తిన్నారు. ఇప్పుడు ఈ కోవలో నిరాశకు గురి చేసిన సినిమా ‘ఆదిపురుష్’.
‘బాహుబలి’ కథానాయకుడైన ప్రభాస్నే పెట్టి.. తానాజీ దర్శకుడు ఓం రౌత్ తీసిన ఈ చిత్రం.. బడ్జెట్, భారీతనం, ప్రి రిలీజ్ హైప్ పరంగా ‘బాహుబలి’ని మ్యాచ్ చేసేట్లు కనిపించింది. ఒకప్పుడు ఈ సినిమాపై ఎంతో నెగెటివిటీ కనిపించినప్పటికీ.. రిలీజ్ టైంకి అంతా సానుకూలంగానే కనిపించింది. హైప్ మామూలుగా లేదు. కానీ తెర మీద బొమ్మ పడ్డాక కథ మారిపోయింది. ప్రేక్షకుల అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయాడు ఓం రౌత్. సినిమాకు ఉన్న హైప్కి కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగేవి.
కానీ విజువలైజేషన్లో, విజువల్ ఎఫెక్ట్స్ను వాడుకోవడంలో, భావోద్వేగాలను పండించడంలో ఓం రౌత్ తేలిపోయాడు. ఈ విషయాల్లో రాజమౌళిని కొట్టేవాడు ఇండియాలో లేరనిమరోసారి రుజువైంది. ‘ఆదిపురుష్’ రిలీజ్ రోజు అందరూ జక్కన్నను తలుచుకుని తనకు తనే సాటి అని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎపిక్ మూవీస్ రాజమౌళికి వదిలేసి మామూలు సినిమాలు తీసుకోవాలని రౌత్ లాంటి దర్శకులకు సలహాలిస్తున్నారు.
This post was last modified on June 16, 2023 4:45 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…