ఈ రోజుతో తెలుగు రాష్ట్రాల వేసవి సెలవులు అధికారికంగా ముగిసిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకున్నాయి. సమ్మర్ సీజన్ ఎప్పుడు లేనంత బ్యాడ్ గా 2023లో టాలీవుడ్ చవిచూసింది. మాములుగా ఈ టైంలో రెండు మూడు నెలలు థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో కళకళలాడాలి. కానీ దానికి భిన్నంగా చోట్ల విపరీతంగా షోలు రద్దయిన పరిస్థితి గత వారం పది రోజులుగా మరీ తీవ్రంగా కనిపిస్తోంది . హైదరాబాద్ లాంటి నగరాలూ దీనికి భిన్నంగా ఏమీ లేవు. థియేటర్ అద్దెలు, కరెంటు బిల్లులు, జీతాలకు సరిపడా మొత్తం కూడా వసూలు కాలేని స్క్రీన్లు వందల్లో ఉన్నాయి
ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవి సీజన్ గా తీసుకుంటే రావణాసురతో మొదలైన డిజాస్టర్ బోణీ మొన్న టక్కర్ వరకు కొనసాగింది. మీటర్ లాంటి చిన్న సినిమాలు సైతం కనీస బిజినెస్ ని రికవరీ చేయలేకపోగా శాకుంతలం తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఒక్క విరూపాక్ష మాత్రమే ట్రూ బ్లాక్ బస్టర్ గా వంద కోట్ల వసూళ్లను దాటేసిన నెంబర్ వన్ గా నిలుచుంది. ఒకే రోజు వచ్చిన రామబాణం, ఉగ్రంలు లాభాలు వచ్చేలా పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. అల్లరోడి మూవీ పర్వాలేదనిపించుకున్నా జనాన్ని రప్పించలేకపోయింది. ఇక కస్టడీ, అన్నీ మంచి శకునములే గురించి చెప్పడానికేం లేదు
అహింస, నేను స్టూడెంట్ సర్ నిరాశపరచడంలో పోటీపడగా మేం ఫేమస్ మెరుగ్గా ఆడినా అది నైజామ్ కే పరిమితమయ్యింది. పరేషాన్, ఇంటింటి రామాయణంలకు తెలంగాణ సెంటిమెంట్ అద్దినా వర్కౌట్ కాలేదు. అన్ స్టాపబుల్ డిజాస్టర్ కాగా విమానం ఎమోషనల్ గా ఉన్నా జనానికి ఎక్కలేదు. ఒక్క బిచ్చగాడు 2, 2018 మాత్రమే ఈ ఎండల్లో లాభాలిచ్చాయి. ఇవి డబ్బింగ్ చిత్రాలు కావడం ఫైనల్ ట్విస్ట్. ప్యాన్ ఇండియాలన్నీ టపా కట్టాయి. సమ్మర్ కన్నా ముందు వచ్చిన బలగం, దసరాలే లాంగ్ రన్ దక్కించుకున్నాయి. ఆదిపురుష్ చేయబోయే అద్భుతాల మీదే అందరి ఆశలన్నీ
This post was last modified on June 12, 2023 11:17 am
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…