కమల్, చరణ్ …ఇద్దరికీ ఒక్కడే విలన్

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటే శంకర్ కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ తీస్తున్నాడు. చెరో పది రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తూ రెండు ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్నాడు శంకర్. అయితే ఈ రెండు సినిమాలకు కామన్ లింకు ఒకటి ఉంది. దర్శకుడు శంకర్ కాకుండా ఈ రెండు సినిమాలకు వర్క్ చేస్తున్న ఓ నటుడు ఉన్నాడు. అతనే ఎస్ జే సూర్య. 

డైరెక్టర్ కం యాక్టర్ ఎస్ జే సూర్య ‘గేమ్ ఛేంజర్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో శ్రీకాంత్ ఒక విలన్ అయినప్పటికీ మరో విలన్ గా సూర్య కనిపిస్తాడట. ఇప్పటికే చరణ్ , సూర్య మీద వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా కంప్లీట్ చేశారని తెలుస్తుంది. తాజాగా ఎస్ జే సూర్య ‘భారతీయుడు 2’ లో మెయిన్ విలన్ అనే న్యూస్ బయటికొచ్చింది. దీంతో శంకర్ తాను తీస్తున్న రెండు భారీ సినిమాళ్లో ఒకే విలన్ ను పెట్టడం హాట్ టాపిక్ అవుతుంది. 

‘స్పైడర్’ లో ఎస్ జే సూర్య తన సైకో విలనిజంతో మెప్పించాడు. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో సూర్య కి ఆ సినిమా తెలుగులో పనవ్వలేదు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ రెండు సినిమాళ్లో సూర్య ఎలాంటి వెరీయేషన్ చూపిస్తాడో ? ఎలాంటి విలనిజం పండిస్తాడో మరి.