Movie News

నాగ్ డౌట్లన్నీ తీరిపోయాయి

వరుస ఫెయిల్యూర్లు ఎలాంటి వ్యక్తి ఆత్మవిశ్వాసాన్నయినా దెబ్బ తీస్తాయి. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇంకెవరూ చేయనన్ని ప్రయోగాలు చేసి.. ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశమిచ్చి అద్భుత ఫలితాలు రాబట్టిన అక్కినేని నాగార్జున సైతం ఈ మధ్య బాగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. కథలు, దర్శకుల ఎంపికలో పొరపాట్లు ఆయన కెరీర్‌ను కిందికి లాగేశాయి. ‘ది ఘోస్ట్’తో ఆయన పతనంలో కొత్త లోతులను చూశారు. ఈ దెబ్బతో తర్వాతి సినిమా విషయంలో ఆయనలో ఎక్కడలేని అయోమయం మొదలైంది.

ముందు అనుకున్న ప్రకారం అయితే.. రైటర్ ప్రసన్న కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళ రీమేక్‌లో నటించాలన్నది నాగ్ ఆలోచన. కథ ఓకే చేశారు. నిర్మాత (శ్రీనివాసా చిట్టూరి) కుదిరాడు. ఇక ముహూర్త వేడుకే తరువాయి అనుకున్న టైంలో నాగ్ ఆలోచన మారింది. తనకు తోడు తన కొడుకులిద్దరూ కూడా పెద్ద ఫెయిల్యూర్లు ఎదుర్కొని అక్కినేని లెగసీనే ప్రమాదంలో పడటంతో నాగ్.. ఈ సారి చిన్న తప్పు చేయడానికి కూడా ఆస్కారం లేకపోయింది.

కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తాను చాటిచెప్పాల్సిన స్థితిలో స్క్రిప్టు విషయంలో మళ్లీ తర్జన భర్జనలు మొదలయ్యాయి. అంతే కాక ఒక దశలో దర్శకుడిని మార్చేయాలన్న చర్చ కూడా జరిగింది. ‘కస్టడీ’ రిలీజ్ టైంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రసన్ననే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని చెప్పలేం అన్నట్లుగా మాట్లాడాడు.

ఐతే గత కొన్ని రోజుల చర్చల అనంతరం ఈ డైలమా నుంచి నాగ్ బయటికి వచ్చేశాడట. సినిమా చూపిస్త మావ మొదలుకుని ధమాకా వరకు ప్రసన్న కుమార్ జైత్రయాత్ర చూస్తే.. అతడికి కమర్షియల్ అంశాలు.. జనాల అభిరుచిపై ఉన్న పట్టును చూసి.. తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడంలో తప్పులేదని నాగ్ అండ్ టీం ఫిక్సయిందట. అలాగే స్క్రిప్టు విషయంలో మరింత కసరత్తు జరిగి.. మాతృకకు చేసిన మార్పులు చేర్పుల విషయంలో నాగ్ సంతృప్తిగా ఉన్నాడని.. జూన్ మధ్యలో షూట్‌కు వెళ్లిపోదామని కూడా చెప్పేశాడని.. అంతకంటే ముందు ముహూర్త వేడుక కూడా చేయబోతున్నారని సమాచారం.

This post was last modified on May 25, 2023 6:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago