ఆలస్యం అమృతం విషమని పెద్దలు ఊరికే అనలేదు. ఏ టైంలో జరిగాల్సినవి ఎప్పటికప్పుడు అయిపోవాలి. లేదంటే ఫలితాలు చేదుగా ఉంటాయి. మేజర్ విషయంలో అదే జరిగింది. విడుదలైన ఏడాదికి ఈ సినిమా శాటిలైట్ ప్రీమియర్ ఇటీవలే టెలికాస్ట్ చేశారు. ప్యాన్ ఇండియా హిట్ మూవీ కాబట్టి టిఆర్పి రేటింగ్ ని భారీగా ఆశించారు. కానీ మరీ అన్యాయంగా అర్బన్ 1.87, అర్బన్ రూరల్ కలిపి 1.70 మాత్రమే వచ్చింది. ఇది చాలా దారుణమైన నెంబర్. బ్లాక్ బస్టర్స్ మొదటిసారి ప్రసారమైనప్పడు హీనపక్షం నాలుగు నుంచి అయిదు మధ్యలో రావాలి. మేజర్ సగం కూడా రాలేదు.
ఓటిటిలు ఉధృతంగా ఉన్న ట్రెండ్ లో టీవీ ఛానల్స్ కొత్త సినిమాలను అందివ్వడంలో చేస్తున్న ఆలస్యం, చూపిస్తున్న అలసత్వం క్రమంగా ఆడియన్స్ లో ఆసక్తిని చంపేస్తోంది. రిలీజైన రెండు వారాల నుంచి నెలన్నర మధ్యలో హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు డిజిటల్ లో వస్తున్నప్పుడు అదే పనిగా బుల్లితెరపై చూడాలంటే వీలైనంత త్వరగా రావాలి. బలగం ఇలాంటి ప్లానింగ్ లో చాలా తెలివిగా వ్యవహరించింది. వంద రోజులు కాగానే వచ్చేయడంతో ఏకంగా 12 రేటింగ్ తో షాక్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో దేనికీ రానంత భారీ ఫిగర్ ఇది.
మొత్తానికి మేజర్ ఒక పాఠంగా నిలిచాడు. గత ఏడాది విడుదలైన సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకుని రెవిన్యూ పరంగానూ సక్సెస్ అయిన ఈ రియల్ హీరో బయోపిక్ త్వరగా టీవీకి తీసుకొచ్చి ఉంటే రీచ్ పెరిగేది. ఒకపక్క నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉండటం, దాని పైరసీ కాపీని లోకల్ ఛానల్స్ ఎప్పుడో వేసేయడం లాంటి కారణాల వల్ల బజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. హక్కులు ఇచ్చేదాంట్లో లేట్ అయ్యిందో లేక ఇంకేదయినా కారణం ఉందో ఏమో కానీ మొత్తానికి మేజర్ కు టిఆర్పి షాక్ గట్టిగానే తగిలింది
This post was last modified on May 25, 2023 7:07 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…