ఏజెంట్ డిజాస్టర్ తో బాగా డిస్టర్బ్ అయిన అఖిల్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. ఇంత కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ కావడం ఒక ఎత్తయితే అక్కినేని అభిమానుల్లో నిరాశ రెట్టింపు కావడం అసలైన బాధ. కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లవుతున్నా ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదన్న ఆక్రోశం అఖిల్ లో విపరీతంగా ఉంది. ఇప్పుడది తీర్చే బాధ్యతను రామ్ చరణ్ తీసుకోబోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్(యువి భాగస్వామి) తో కలిసి మొదలుపెట్టబోయే వి మెగా బ్యానర్ ఫస్ట్ వెంచర్ గా అఖిల్ మూవీనే ఉండబోతోందట
ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ మీద చరణ్ కు చాలా అఫెక్షన్ ఉంది. అందుకే ఏజెంట్ ప్రమోషన్ కోసం రామ్ చరణ్ షల్ ప్రత్యేకంగా ఒక వీడియో టీజర్ బిట్ లో ధృవ గెటప్ లో నటించాడు. ఇంతకు ముందు ఇలా ఎవరికీ చేయలేదు. పలు ఇంటర్వ్యూలలో అఖిల్ కూడా అన్నయ్య లాగా మెగా పవర్ స్టార్ నుంచి ఎలాంటి గైడెన్స్ తీసుకుంటానో చెప్పాడు. ఈసారి కథ ఎంపిక, దర్శకుడిని గైడ్ చేయడం వగైరా వ్యవహారాలన్నీ అఖిల్ చూసుకోడట. మొత్తం చరణ్ పర్యవేక్షణలో విక్రమ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుని అన్నీ సెట్ చేయబోతోంది.
ఇలా అయినా అఖిల్ కు బ్రేక్ దక్కతే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. యువిలోనే పలు సినిమాలకు పని చేసిన అనిల్ ని దీని ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళుతుందనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏది ఏమైనా అఖిల్ వీలైనంత త్వరగా సినిమాల వేగం పెంచాలి. అటు నాగచైతన్య కస్టడీతో దెబ్బ తిన్నాడు. నాన్న నాగార్జున ప్రాజెక్ట్ జనవరి నుంచి వాయిదా పడుతూ జూన్ లో షూటింగ్ మొదలుకాబోతోంది. ఇలాంటి పరిస్థితిలో ఎవరో ఒకరు స్పీడ్ గా ఉండటం అవసరం. చైతు రెండు లాక్ చేసుకున్నాడు కానీ అఖిల్ కి ఒకటే ఫైనలయ్యింది
This post was last modified on May 26, 2023 11:37 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…