ఏజెంట్ డిజాస్టర్ తో బాగా డిస్టర్బ్ అయిన అఖిల్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. ఇంత కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ కావడం ఒక ఎత్తయితే అక్కినేని అభిమానుల్లో నిరాశ రెట్టింపు కావడం అసలైన బాధ. కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లవుతున్నా ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదన్న ఆక్రోశం అఖిల్ లో విపరీతంగా ఉంది. ఇప్పుడది తీర్చే బాధ్యతను రామ్ చరణ్ తీసుకోబోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్(యువి భాగస్వామి) తో కలిసి మొదలుపెట్టబోయే వి మెగా బ్యానర్ ఫస్ట్ వెంచర్ గా అఖిల్ మూవీనే ఉండబోతోందట
ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ మీద చరణ్ కు చాలా అఫెక్షన్ ఉంది. అందుకే ఏజెంట్ ప్రమోషన్ కోసం రామ్ చరణ్ షల్ ప్రత్యేకంగా ఒక వీడియో టీజర్ బిట్ లో ధృవ గెటప్ లో నటించాడు. ఇంతకు ముందు ఇలా ఎవరికీ చేయలేదు. పలు ఇంటర్వ్యూలలో అఖిల్ కూడా అన్నయ్య లాగా మెగా పవర్ స్టార్ నుంచి ఎలాంటి గైడెన్స్ తీసుకుంటానో చెప్పాడు. ఈసారి కథ ఎంపిక, దర్శకుడిని గైడ్ చేయడం వగైరా వ్యవహారాలన్నీ అఖిల్ చూసుకోడట. మొత్తం చరణ్ పర్యవేక్షణలో విక్రమ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుని అన్నీ సెట్ చేయబోతోంది.
ఇలా అయినా అఖిల్ కు బ్రేక్ దక్కతే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. యువిలోనే పలు సినిమాలకు పని చేసిన అనిల్ ని దీని ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళుతుందనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏది ఏమైనా అఖిల్ వీలైనంత త్వరగా సినిమాల వేగం పెంచాలి. అటు నాగచైతన్య కస్టడీతో దెబ్బ తిన్నాడు. నాన్న నాగార్జున ప్రాజెక్ట్ జనవరి నుంచి వాయిదా పడుతూ జూన్ లో షూటింగ్ మొదలుకాబోతోంది. ఇలాంటి పరిస్థితిలో ఎవరో ఒకరు స్పీడ్ గా ఉండటం అవసరం. చైతు రెండు లాక్ చేసుకున్నాడు కానీ అఖిల్ కి ఒకటే ఫైనలయ్యింది
This post was last modified on May 26, 2023 11:37 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…