బాలీవుడ్ బడా హీరోలు మన స్టార్లతో జట్టు కట్టేందుకు ఎంతగా ఉత్సాహపడుతున్నారో ఈ మధ్య కాలంలో గమనిస్తూనే ఉన్నాం. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రలో నటించాడు. లాల్ సింగ్ చద్దా కోసం అమీర్ ఖాన్ కోరిమరీ నాగ చైతన్యకు స్నేహితుడి పాత్రను ఆఫర్ చేశారు. జస్ట్ మాటవరసకు అడగ్గానే చిరంజీవి పిలుపు మీద సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చి గాడ్ ఫాదర్ చేశారు. దానికి బదులుగా రామ్ చరణ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ లో తళుక్కున మెరిసే డాన్స్ లో పాలు పంచుకున్నాడు. తాజాగా వీటన్నటికి తలదన్నే క్రేజీ కాంబినేషన్ ఒకటి సెట్ కాబోతోందని ముంబై అప్ డేట్
2019లో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వార్ లో హృతిక్ రోషన్ – టైగర్ శ్రోఫ్ లు నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే యష్ రాజ్ ఫిలింస్ దీనికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్ గా వార్ 2కి స్టేజి సెట్ అయ్యింది. అయితే మొదటి భాగం తీసిన సిద్దార్థ్ ఆనంద్ కి కాకుండా ఆ బాధ్యతను ఈసారి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీకి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ట్విస్టు ఏంటంటే హృతిక్ ఈ పార్ట్ టూలో కొనసాగనుండగా తనను ఢీ కొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడని లీక్ వచ్చింది.
విశ్వసనీయ వర్గాల నుంచి బయటికి రావడంతో ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ ఫైటర్స్ లో ఇద్దరైన హృతిక్ తారక్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ప్రాథమికంగా చర్చలు పూర్తయినట్టు సమాచారం. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2, 3 మొదలుపెట్టేలోగా ఈ వార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. కాకపోతే కాస్త టైం ఎక్కువ పట్టేలా ఉంది. కొరటాల శివ ప్రాజెక్టులో బిజీగా ఉన్న తారక్ మనసులో ఏముందో ఏం చెప్పాడో వేచి చూడాలి
This post was last modified on April 5, 2023 11:23 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…