బాలీవుడ్ బడా హీరోలు మన స్టార్లతో జట్టు కట్టేందుకు ఎంతగా ఉత్సాహపడుతున్నారో ఈ మధ్య కాలంలో గమనిస్తూనే ఉన్నాం. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రలో నటించాడు. లాల్ సింగ్ చద్దా కోసం అమీర్ ఖాన్ కోరిమరీ నాగ చైతన్యకు స్నేహితుడి పాత్రను ఆఫర్ చేశారు. జస్ట్ మాటవరసకు అడగ్గానే చిరంజీవి పిలుపు మీద సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చి గాడ్ ఫాదర్ చేశారు. దానికి బదులుగా రామ్ చరణ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ లో తళుక్కున మెరిసే డాన్స్ లో పాలు పంచుకున్నాడు. తాజాగా వీటన్నటికి తలదన్నే క్రేజీ కాంబినేషన్ ఒకటి సెట్ కాబోతోందని ముంబై అప్ డేట్
2019లో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వార్ లో హృతిక్ రోషన్ – టైగర్ శ్రోఫ్ లు నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే యష్ రాజ్ ఫిలింస్ దీనికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్ గా వార్ 2కి స్టేజి సెట్ అయ్యింది. అయితే మొదటి భాగం తీసిన సిద్దార్థ్ ఆనంద్ కి కాకుండా ఆ బాధ్యతను ఈసారి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీకి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ట్విస్టు ఏంటంటే హృతిక్ ఈ పార్ట్ టూలో కొనసాగనుండగా తనను ఢీ కొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడని లీక్ వచ్చింది.
విశ్వసనీయ వర్గాల నుంచి బయటికి రావడంతో ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ ఫైటర్స్ లో ఇద్దరైన హృతిక్ తారక్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ప్రాథమికంగా చర్చలు పూర్తయినట్టు సమాచారం. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2, 3 మొదలుపెట్టేలోగా ఈ వార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. కాకపోతే కాస్త టైం ఎక్కువ పట్టేలా ఉంది. కొరటాల శివ ప్రాజెక్టులో బిజీగా ఉన్న తారక్ మనసులో ఏముందో ఏం చెప్పాడో వేచి చూడాలి
This post was last modified on April 5, 2023 11:23 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…