అనుమానాలే నిజమయ్యాయి. సీనియర్ నటులు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకున్నారంత రేంజ్ లో హడావిడి చేసిన వీడియోలు సినిమా కోసమని అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ఈ తతంగం పై చాలా అనుమానాలు ఉన్నా సోషల్ మీడియాలో ఇదంతా వాస్తవమే అనేంత రేంజ్ లో వైరలయ్యాయి. మళ్ళీ పెళ్లి అనే సినిమాని ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ స్వయంగా నిర్మించారు. దాని తాలూకు చిన్న ప్రోమోను ఇవాళ రిలీజ్ చేశారు. ముందు సెకండ్ ఇన్నింగ్స్ టైటిల్ అనుకున్నారు కానీ ఫైనల్ గా మార్చేశారు
మొత్తానికి స్కెచ్ మాత్రం అదిరింది. ఒకపక్క తమ బంధం గురించి నరేష్ పవిత్రలు పదే పదే స్పష్టత ఇవ్వడంతో పాటు ఎలాంటి స్టార్ అట్రాక్షన్ లేని మూవీకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఇది తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా రేంజ్ లో కన్నడ ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. సాంకేతిక వర్గాన్ని బలంగా సెట్ చేసుకున్నారు. శరత్ బాబు, జయసుధ, వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత ఘాడంగా ఉందో మరోసారి కెమెరా ముందు నరేష్ పవిత్రలు ఆవిష్కరించారు
ఇటీవలే జరిగిన అన్నీ మంచి శకునములే సాంగ్ లాంచ్ తనను తాను నిత్య పెళ్లి కొడుకుగా వర్ణించి నవ్వించిన నరేష్ రెండు రోజుల గ్యాప్ తో ఇలా స్వీట్ ట్విస్టు ఇచ్చారు. ఇద్దరి సహజీవనం గురించి అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ లీగల్ గా పెళ్లి చేసుకునేందుకు అడ్డంకులు ఉండటంతో ఇలా ఆ ముచ్చటని తెరమీద జరుపుకుంటున్నారు. వయసు మళ్ళాక రెండో వివాహం అవసరం గురించి వివరిస్తూనే ఆ జంట మనోభావాలను ఆవిష్కరించే ప్రయత్నం ఎంఎస్ రాజుగారు ఇందులో చేశారట. ఒకేసారి పుణ్యం పురుషార్థం దక్కించుకోవడమంటే ఇదే
This post was last modified on March 24, 2023 11:36 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…