ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో ఆమె చాలా కాలం ప్రేక్షకుల్లో నిలిచిపోయారు. అయితే కాలం మారేకొద్దీ షకీలా సినిమాలకు దూరమయ్యారు. ఆర్ధికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు పలుమార్లు తెలిపారు. అప్పుడప్పుడు టీవీ షోలు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తూ వస్తున్నారు.
ఇప్పుడు షకీలా మెడకు సర్జరీ చేయించుకున్న విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె మెడకు కాలర్ వేసుకుని కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా మెడకు సంబంధించిన తీవ్ర సమస్యతో బాధపడిన ఆమె చివరకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
తనకు ఈ సమస్య రావడానికి ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడటం కూడా ఒక కారణమని షకీలా చెప్పడం షాక్ కు గురిచేస్తోంది. మంచంపై ఒక వైపు పడుకుని గంటల తరబడి గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటం అలవాటుగా మారిందని ఆమె వెల్లడించారు. ఇలా ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండటం వల్ల మెడపై ఒత్తిడి పెరిగిందని ఆమె చెప్పినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఈ సమస్యకు చికిత్సగా సర్జరీ చేయించుకున్నానని, దానికి దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చయిందని షకీలా తెలిపారు. ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్న ఆమె కొన్ని పనులకు ఇతరుల సహాయం తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు.
తనకు ఎదురైన పరిస్థితిని చెబుతూ మొబైల్ ఫోన్ను అవసరానికి మించి వాడొద్దని షకీలా సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువసేపు ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. ఒకప్పుడు వెండితెరపై తనకంటూ భారీ క్రేజ్ సంపాదించుకున్న షకీలా ఇప్పుడు ఇలా మెడకు కాలర్తో కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం చికిత్స తర్వాత కోలుకుంటున్నారని తెలుస్తోంది.
This post was last modified on August 13, 2026 2:59 pm
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…
టాలీవుడ్ మెగాస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడటం అరుదు. ఆ మధ్య భోళా శంకర్, జైలర్…