సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నైతికంగా బలం పుంజుకుంటోందా ? అంటే అవుననే చెప్పాలి. మొన్ననే మూడు పట్టభద్రుల ఎంఎల్సీల సీట్లను గెలుచుకోవటం, తాజాగా ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలో ఒక సీటు గెలుచుకోవటం అంటే పార్టీకి ఆక్సిజన్ పెరుగుతున్నట్లే అనుకోవాలి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీలో బాగా నైరాశ్యం పెరిగిపోయింది. ఎందుకంటే ఎన్నిక ఏదైనా ఓటమి మాత్రమే ఎదురవుతోంది.
పార్టీ నేతల్లో జోష్ పెంచాలన్న చంద్రబాబునాయుడు ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టేసి అధినేత రకరకాల ప్రోగ్రాములతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. నేతల్లో మనో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం మీద రెగ్యులర్ గా పోరాటాలు చేస్తున్నారు. చంద్రబాబును స్పూర్తిగా తీసుకుని తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు లాంటి నేతలు కూడా మళ్ళీ చురుగ్గా కనబడుతున్నారు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే రోజుల వ్యవధిలో నాలుగు ఎంఎల్సీ స్దానాలను గెలుచుకోవటం అంటే పార్టీకి ఆక్సిజన్ అందినట్లే అనుకోవాలి. నిజానికి ఇపుడు గెలుచుకున్న ఎంఎల్సీల గెలుపు వల్ల శాసనమండలిలో పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ఈ గెలుపును ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతంగా చూడాలి. దీన్నే చంద్రబాబు ప్రముఖంగా హైలైట్ చేస్తున్నారు. అందుకనే నేతలు, కార్యకర్తల్లో బాగా ఉత్సాహం కనబడుతోంది. ఇపుడు జరిగిన ఎన్నికలకు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.
అయితే రాబోయే ఎన్నికల్లో పూర్తిస్ధాయి సామర్ధ్యంతో పోరాడాలంటే ఇపుడీ విజయాలు టీడీపీకి మంచి టానిక్కుగా పనిచేస్తాయి. ఇపుడు లభించిన ఆక్సిజన్ తో తమ్ముళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేయాలంటే రాబోయే ఏడాదికాలం ఎంతో జాగ్రత్తగా కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలి. పొత్తులు, సీట్ల కేటాయింపు, అభ్యర్ధుల ఎంపిక లాంటి విషయాల్లో చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మొహమటానికి పోయినా, ఒత్తిళ్ళకు లొంగిపోయినా పార్టీ ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇపుడు అందిన ఆక్సిజన్ ఏడాది పాటు ఉండాలంటే పార్టీ కార్యక్రమాల్లో మరింత స్పీడు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on March 24, 2023 3:58 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…