Political News

ఎవ‌రా న‌లుగురు.. ఏరా న‌లుగురు: వైసీపీ తేల్చేసింది!!

వైసీపీలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ సినిమాలో పాడిన పాట ‘ఎవ‌రా న‌లుగురు.. ఏరా న‌లుగురు.. ‘ అనే పాట పాడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడు స్థానాల‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని భావించిన వైసీపీకి భారీ ఎదురు దెబ్బ‌తగిలింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా.. ఆపార్టీ ఒక స్థానాన్ని కోల్పోయింది. దీనికి న‌లుగురు ఎమ్మెల్యేలే కార‌ణ‌మ‌ని తేలిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఆన‌లుగురు ఎవ‌ర‌నేది ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఆ న‌లుగురి పైనా.. వైసీపీలోనూ క్లారిటీ వ‌చ్చింది. ఇద్ద‌రు ప్ర‌త్య‌క్షంగా క‌ళ్ల‌కు క‌నిపిస్తున్నారు. ఒక‌రు నెల్లూరు రూరల్‌ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఈయ‌న ఆత్మప్రబోధానుసారం ఓటేసినట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి పంచుమ‌ర్తి అనురాధ‌ గెలుపొందిన వెంటనే శ్రీధర్‌రెడ్డి కుటుంబం నెల్లూరులోని త‌మ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు.

మ‌రొక‌రు నెల్లూరు జిల్లా వెంక‌టగిరి సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఈయ‌న స్థానంలో వైసీపీ ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల పార్టీ నియమించింది. ఆనంను అసలు పార్టీలోనే లేనట్లుగా వైసీపీ పరిగణిస్తోంది. తాజా ఎన్నికల్లో ఓటు విషయమై ఆయన్ను వైసీపీ నేతలు ఎవరూ కనీసం సంప్రదించలేదు. దీంతో ఆనం సైతం టీడీపీ కే ఓటే శార‌ని వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

తెర‌చాటున ఉన్న ఆ ఇద్ద‌రు వీరే!
ఆ న‌లుగురిలో ఇద్ద‌రు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తుండ‌గా.. మ‌రో ఇద్ద‌రు మాత్రం తెర‌చాటున ఉన్నారు. వారిపైనా ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటేశారు. ఆయ‌న ఆత్మ‌కూరు నుంచి ప్రాధాన్యం వ‌స్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే అడిగిన కొన్ని పనులు కూడా చేయలేదని, చివరికి ఆయన కుటుంబసభ్యులు ఒకరికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి అడిగినా ఇవ్వలేదని పార్టీ వర్గాల కథనం. దీంతో ఆయ‌న టీడీపీకి అనుకూలంగా ఓటెత్తిన‌ట్టు వైసీపీ నేత‌లు బాహాటంగానే చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, మ‌రో నేత‌.. గుంటూరుకు చెందిన ఎస్సీ సామాజిక వ‌ర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హిళా నాయ‌కురాలు. ఈమె కూడా టీడీపీకి అనుకూలంగానే ఓటేశార‌ని.. వైసీపీ గుర్తించింది. ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం సాధ్యం కాదని అగ్రనేతలు కొద్దిరోజుల కిందట తేల్చిచెప్పారు. ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అప్పుడు కూడా టికెట్‌ ఇవ్వలేనని పునరుద్ఘాటించారు. దీంతో ఆమెకూడా వైసీపీకి వ్య‌తిరేకంగానే ఓటేశారు. మొత్తంగా.. ఆ న‌లుగురు ఎవ‌రో తేలిపోయింది. ఇద్ద‌రిపై ఎలానూ చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి లేదు. సో.. మిగిలిన ఇద్ద‌రిని ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 24, 2023 3:53 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

57 mins ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

1 hour ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

2 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

2 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

2 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

3 hours ago