Political News

ఎవ‌రా న‌లుగురు.. ఏరా న‌లుగురు: వైసీపీ తేల్చేసింది!!

వైసీపీలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ సినిమాలో పాడిన పాట ‘ఎవ‌రా న‌లుగురు.. ఏరా న‌లుగురు.. ‘ అనే పాట పాడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడు స్థానాల‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని భావించిన వైసీపీకి భారీ ఎదురు దెబ్బ‌తగిలింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా.. ఆపార్టీ ఒక స్థానాన్ని కోల్పోయింది. దీనికి న‌లుగురు ఎమ్మెల్యేలే కార‌ణ‌మ‌ని తేలిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఆన‌లుగురు ఎవ‌ర‌నేది ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఆ న‌లుగురి పైనా.. వైసీపీలోనూ క్లారిటీ వ‌చ్చింది. ఇద్ద‌రు ప్ర‌త్య‌క్షంగా క‌ళ్ల‌కు క‌నిపిస్తున్నారు. ఒక‌రు నెల్లూరు రూరల్‌ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఈయ‌న ఆత్మప్రబోధానుసారం ఓటేసినట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి పంచుమ‌ర్తి అనురాధ‌ గెలుపొందిన వెంటనే శ్రీధర్‌రెడ్డి కుటుంబం నెల్లూరులోని త‌మ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు.

మ‌రొక‌రు నెల్లూరు జిల్లా వెంక‌టగిరి సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఈయ‌న స్థానంలో వైసీపీ ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల పార్టీ నియమించింది. ఆనంను అసలు పార్టీలోనే లేనట్లుగా వైసీపీ పరిగణిస్తోంది. తాజా ఎన్నికల్లో ఓటు విషయమై ఆయన్ను వైసీపీ నేతలు ఎవరూ కనీసం సంప్రదించలేదు. దీంతో ఆనం సైతం టీడీపీ కే ఓటే శార‌ని వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

తెర‌చాటున ఉన్న ఆ ఇద్ద‌రు వీరే!
ఆ న‌లుగురిలో ఇద్ద‌రు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తుండ‌గా.. మ‌రో ఇద్ద‌రు మాత్రం తెర‌చాటున ఉన్నారు. వారిపైనా ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటేశారు. ఆయ‌న ఆత్మ‌కూరు నుంచి ప్రాధాన్యం వ‌స్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే అడిగిన కొన్ని పనులు కూడా చేయలేదని, చివరికి ఆయన కుటుంబసభ్యులు ఒకరికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి అడిగినా ఇవ్వలేదని పార్టీ వర్గాల కథనం. దీంతో ఆయ‌న టీడీపీకి అనుకూలంగా ఓటెత్తిన‌ట్టు వైసీపీ నేత‌లు బాహాటంగానే చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, మ‌రో నేత‌.. గుంటూరుకు చెందిన ఎస్సీ సామాజిక వ‌ర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హిళా నాయ‌కురాలు. ఈమె కూడా టీడీపీకి అనుకూలంగానే ఓటేశార‌ని.. వైసీపీ గుర్తించింది. ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం సాధ్యం కాదని అగ్రనేతలు కొద్దిరోజుల కిందట తేల్చిచెప్పారు. ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అప్పుడు కూడా టికెట్‌ ఇవ్వలేనని పునరుద్ఘాటించారు. దీంతో ఆమెకూడా వైసీపీకి వ్య‌తిరేకంగానే ఓటేశారు. మొత్తంగా.. ఆ న‌లుగురు ఎవ‌రో తేలిపోయింది. ఇద్ద‌రిపై ఎలానూ చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి లేదు. సో.. మిగిలిన ఇద్ద‌రిని ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 24, 2023 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

18 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago