తెలంగాణా నుండి చాలా మంది దర్శకులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వారి ప్రాంతం మీద సినిమా తీయలేదు సరే కానీ సెపరేట్ స్టేట్ వచ్చాక ఎందుకు అలాంటి ఆలోచన చేయలేదు ? ప్రస్తుతం బలగం చూసి ప్రేక్షకులు అనుకుంటున్న మాటలివి. అవును వేణు తెలంగాణా నటుడు. రాజన్న సిరిసిల్లలో పుట్టాడు. జబర్దస్త్ మానేసి మెగా ఫోన్ పట్టాలని డిసైడ్ అవ్వగానే అతనికి వచ్చిన ఆలోచన తెలంగాణా రూట్ కెళ్ళి ఓ సినిమా తీయాలి. కిందా మీదా పడ్డాడు. దిల్ రాజు సపోర్ట్ తో ఓ గొప్ప సినిమా ప్రేక్షకులకి అందించాడు. డెబ్యూ డైరెక్టర్ గా ఎవరూ అందుకోలేని ప్రశంసలు దక్కించుకుంటూ వేణు ది గ్రేట్ అనిపించుకుంటున్నాడు.
నిజానికి హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి , వంశీ పైడిపల్లి, దశరథ్, సంపత్ నంది , వేణు ఉడుగుల, తరుణ్ భాస్కర్ ఇలా తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే తెలంగాణలో పుట్టిన దర్శకులున్నారు. కానీ ఎవరూ తమ ప్రాంతాన్ని స్క్రీన్ పై చూపించే ప్రయత్నం కానీ అలాంటి కథ కానీ ప్లాన్ చేసుకోలేదు. ఎన్ శంకర్ ఒక్కడే తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో జై బోలో తెలంగాణ సినిమా తీశాడు.
అయితే వేణులా తెలంగాణా సంప్రదాయాన్ని , ఇక్కడి సంస్కృతిని మిగతా వారికి చూపించాలనే ఆలోచన తెలంగాణా దర్శకులకి రాకపోవడం గమనార్హం. ఇప్పుడు బలగంకి వస్తున్న ఆధారణ , అభినందనలు , గౌరవం ఊహించని కలెక్షన్స్ చూస్తూ ఈ దర్శకులంతా ఇంత వరకూ ఇలా తమ ప్రాంతంలో మట్టి కథ గురించి ఆలోచించకుండా తప్పు చేశామని లోలోపల బాధ పడటం ఖాయం.
ఏదేమైనా దర్శకులుగా ఎన్నో ఏళ్ల నుండి ఉన్న కొందరు చేయాలేనిది ఒక కమెడియన్ దర్శకుడిగా మారి చేసి ఔరా అనిపించాడు. అందుకే వేణుకి తెలంగాణా ప్రజల నుండి ఎక్కువ గౌరవం అందుతుంది. కమర్షియల్ సినిమాలే కాదు ఇలాంటి కథలతో సినిమా తీసినా ప్రేక్షకులు చూసి కాసులు ఇస్తారని బలగం తెలంగాణా దర్శకులకి ఓ పాఠం చెప్పినట్టయింది.
This post was last modified on March 16, 2023 10:18 am
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…