‘ఛాయ్ బిస్కెట్’ పేరుతో ముందు ఒక వెబ్ సైట్ పెట్టి.. అందులో క్రియేటివ్ పోస్టులు పెడుతూ తెలుగు నెటిజన్లు ఆకర్షించి.. ఆపై షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు తీస్తూ తమ అభిరుచిని చాటుకుని ఆదరణను పెంచుకున్నారు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర. మంచి కంటెంట్ ఇస్తే కొంచెం ఆలస్యం అయినా బలమైన ఫ్యాన్ బేస్ పెరుగుతుంది అనడానికి ఛాయ్ బిస్కెట్ సంస్థే ఉదాహరణ. ఈ సంస్థ నుంచే సుహాస్, సందీప్ రాజ్ లాంటి ఎంతోమంది ప్రతిభావంతులు ప్రతిభ చాటుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారు. అక్కడా సక్సెస్ అయ్యారు.
ఛాయ్ బిస్కెట్ అధినేతలు ఇప్పటికే ‘మేజర్’తో ఫిలిం ప్రొడక్షన్లోకి కూడా దిగారు. మహేష్ బాబుతో కలిసి అనురాగ్, శరత్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయి ఛాయ్ బిస్కెట్ సంస్థకు టాలీవుడ్లో ఘనమైన ఆరంభాన్నిచ్చింది. ఇప్పుడు ఈ సంస్థ సోలోగా ‘రైటర్ పద్మభూషణ్’ అనే చిన్న సినిమాను నిర్మించింది.
ఛాయ్ బిస్కెట్తో వెలుగులోకి వచ్చిన సుహాస్ హీరోగా, ఆ సంస్థ షార్ట్ ఫిలిమ్ తీసిన షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతూ తీర్చిదిద్దిన చిత్రమిది. తమదైన శైలిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ ముంగిట మంచి బజ్ తీసుకురావడంలో ఛాయ్ బిస్కెట్ విజయవంతం అయింది. ఇళాంటి చిన్న సినిమాకు రిలీజ్ ముందు రోజే ప్రిమియర్లు పడడం.. అవి హౌస్ ఫుల్ కావడం విశేషమే. టాక్ కూడా బాగుండడం.. గత వీకెండ్లో దీనికి పోటీగా రిలీజైన సినిమాలు తేలిపోవడంతో ‘రైటర్ పద్మభూషణ్’ పెద్ద సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడంతో థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఈ చిత్ర డిజిటల్ హక్కుల అమ్మకం పూర్తయింది.
సినిమాకు పబ్లిసిటీతో కలిపి నాలుగు కోట్ల దాకా అవగా.. ఆ మొత్తం ఓటీటీ డీల్తోనే వచ్చేసిందట. ఇప్పుడు థియేటర్ల ద్వారా వస్తున్నదంతా లాభమే. దీంతో పాటు శాటిలైట్, ఇతర హక్కులు ఉండనే ఉన్నాయి. అటు ఇటుగా పది కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం తెచ్చిపెట్టేలా ఉందీ చిత్రం. అంటే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయినట్లే.
This post was last modified on February 7, 2023 3:14 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…