నిన్న ఉన్నపళంగా అల్లు అరవింద్ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అనే న్యూస్ మీడియాకి అందింది. ఆ వెంటనే మీడియా అంతా దీని వెనుక అసలేం జరుగుతుందనే ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో పరశురామ్ మేటర్ బయటికొచ్చింది. దర్శకుడు పరశురామ్ గీతా ఆర్ట్స్ లో ‘గీత గోవిందం’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత వెంటనే గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమాకు అడ్వాన్స్ అందుకున్నాడు పరశురామ్. కానీ స్క్రిప్ట్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తర్వాత పరశురామ్ 14 రీల్స్ దగ్గర అడ్వాన్స్ అందుకున్నాడు. మైత్రి కూడా గీత గోవిందం టైమ్ లో ఎడ్వాన్స్ ఇచ్చారు. ఇంకా మరిన్ని బేనర్స్ దగ్గర పరశురామ్ అడ్వాన్స్ అందుకున్నాడు. ఇక్కడే అసలు చిక్కొచ్చింది.
సర్కారు వారి పాట కంటే ముందే పరశురామ్ 14 రీల్స్ లో నాగ చైతన్య తో ఓ సినిమా చేయాల్సి ఉంది. మహేష్ ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమాను పక్కన పెట్టేసి సర్కారు వారి పాట సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. అందులోనే 14 రీల్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసేశాడు. కానీ వాళ్ళకి సోలోగా ఓ సినిమా చేయాల్సి ఉంది. నాగ చైతన్య కి ఓ కథ చెప్పాడు. కానీ అది వర్కవుట్ అవ్వట్లేదు. అందుకే మరో ప్రాజెక్ట్ వెతికే క్రమంలో విజయ్ కి ఓ లైన్ చెప్పడం ఒప్పించడం జరిగింది.
పరశురామ్ , విజయ్ కాంబో సినిమాను దిల్ రాజు ఫస్ట్ గా ఎనౌన్స్ చేసేశాడు. పరశురామ్ గీతా ఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమా చేయాల్సి ఉంది. విజయ్ తో అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కానీ పరశురామ్ యూ టర్న్ తీసుకొని దిల్ రాజు బేనర్ లో సినిమా ఒకే చేయించుకోవడమే అరవింద్ గారికి ఆగ్రహం తెప్పించింది. ఏదేమైనా నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి అసలు మీటర్ ఓపెన్ చేస్తే ఇండస్ట్రీలో కొత్త రచ్చ మొదలయ్యేది. కానీ ఈ లోపు పరశురామ్ భార్య అర్చన రంగంలో దిగి అల్లు అరవింద్ ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి ప్రెస్ మీట్ ఆపించారని తెలుస్తుంది.
పరశురామ్ వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటుంది. అందుకే ఆమె రంగంలో దిగడం ప్రాబ్లెమ్ వెంటనే సాల్వ్ అవ్వడం గంటల్లో జరిగిపోయిందట. ఇక అల్లు అరవింద్ కూడా ఆమె ఆవేదన అర్థం చేసుకొని సైలెంట్ అయ్యారని టాక్ వినబడుతుంది. ఏదేమైనా ఈ సినారియోలో పరశురామ్ అందిన చోట్ల అడ్వాన్సులు తీసుకొని ఇరుక్కున్నట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది.
This post was last modified on February 7, 2023 3:22 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…