ఫాన్స్ కు పూనకాలు తెప్పించే ఆ డైలాగ్ ఉంటాదా పవన్?

కొన్ని డైలాగులు రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అవుతాయి ఎట్రాక్ట్ చేస్తాయి. అలాగే కొన్ని డైలాగులు రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్ లో నుండి పాపులర్ అవుతాయి. కానీ ఇటివల సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఓ డైలాగ్ పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న సినిమాలోనిదే ఆ డైలాగ్. ఆచార్య రిలీజ్ టైంలో అనిల్ రావిపూడి రూట్లో కెళ్ళి చిరు , చరణ్ , కొరటాల శివ ను ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు హరీష్ శంకర్. 

ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలో రాబోయే డైలాగ్ లీక్ చేస్తా అంటూ చిరు ఓ డైలాగ్ చెప్పేశాడు. “మొన్న వీడు మన ఇంటికొచ్చి పెద్దగా అరిచినప్పుడు ఏంటి వీడి ధైర్యం అనుకున్నాను. ఇప్పుడర్థమైంది నడిస్తే వీడి వెనుక లక్ష మంది నడుస్తారు… బహుశా ఇదే వీడి ధైర్యమేమో… కదండీ ఆ లక్ష మందికి వాడు ముందు నడుస్తున్నాడనే దైర్యం” ఇదీ ఆ పవర్ ఫుల్ డైలాగ్. ఈ డైలాగ్ చిరు చెప్పడంతో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ ఈ డైలాగ్ పట్టుకొని కథ అల్లేశారు కూడా. 

ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ కథ మారింది. తమిళ సినిమా తేరి తీసుకొని అటు ఇటు గా కొన్ని కీలక మార్పులతో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కొన్నేళ్ళ క్రితం ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని కొందరు దర్శకులతో తీయాలని ప్రయత్నించిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు పవన్ ని ఒప్పించి హరీష్ శంకర్ చేతిలో పెట్టారని టాక్. మేకర్స్ ఇంకా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమా టైటిల్ కూడా మార్చారు.

భగత్ సింగ్ కి ముందు ఉన్న భవదీయుడు తీసేసి దానికి ఉస్తాద్ అనే పదం చేర్చారు. మరి ఈ సినిమాలో చిరు లీక్ చేసి చెప్పిన హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుందా ? లేదా అని పవన్ అభిమానులు సందేహ పడుతున్నారు. ఇప్పుడు కచ్చితంగా హరీష్ ఈ డైలాగ్ సినిమాలో ఎక్కడో ఓ చోట పెట్టాల్సిందే లేదంటే ఫ్యాన్స్ నిరాశ పడటం ఖాయం.