Movie News

కొరటాల చేసింది రైటా రాంగా

ఆచార్య డిజాస్టర్ తర్వాత బయట ఎక్కడా కనిపించకుండా మొన్నీమధ్య ఎన్టీఆర్ 30 తాలూకు పనుల ఫోటోల్లో కనిపించిన కొరటాల శివ ఇవాళ ఒక ఈవెంట్ కు అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో రానని చెప్పడం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఏ దర్శకుడికైనా ఫ్లాపులు సహజమేనని అంతమాత్రాన ఇలా మొహం చాటేసి మరీ తప్పించుకుపోవాల్సిన అవసరం ఏమిటని కొన్ని కథనాలు వచ్చాయి. కొందరు ఏకంగా తారక్ ప్రాజెక్టుకు ఏమైనా చిక్కు పడిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కారణం ఏదైనా కొరటాల చేసింది ఒక రకంగా రైటే. అదెందుకో చూద్దాం.

నిజమే. డిజాస్టర్లు ఎవరికైనా వస్తాయి. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన అనుభవమున్న దాసరి నారాయణరావుగారు రెండో తరం అతి పెద్ద స్టార్లు చిరంజీవి బాలకృష్ణలకు దారుణమైన ఫ్లాపులు ఇచ్చారు. అవి లంకేశ్వరుడు, పరమవీరచక్ర. వీళ్ళతో అయన చేసింది ఇవే. అంతకు ముందు ఆ తర్వాతా లేవు. దానికి దాసరి గారు కుంగిపోలేదు. మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. చిన్న సినిమాలతోనూ పెద్ద హిట్లు కొట్టారు. ఇంకా చాలా ఉదాహణలు ఉన్నాయి కానీ కొరటాల విషయానికి వద్దాం. ఆచార్య పోయింది. అది గడిచిపోయిన గతం. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తారక్ ప్యాన్ ఇండియా మూవీ మీదే ఉంది.

ఇప్పుడు ఏ సందర్భంలో బయటికి వచ్చినా మీడియా ఎక్కడో ఒక చోట పట్టేసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. సమాధానం చెప్పడం కష్టమేమి కాదు కానీ లేనిపోనివి అడిగి దాన్ని మసాలా కంటెంట్ గా యుట్యూబ్ థంబ్ నెయిల్స్ గా మార్చుకునే అవకాశం చాలా ఉంది. మొన్న ఆలీ ఇంటర్వ్యూలో మణిశర్మ అన్న మాటలకే ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఇవన్నీ గమనించే కొరటాల శివ ముందు షూటింగ్ స్టార్ట్ చేసి అది కొంత భాగం అయ్యాక అప్పుడు ఓపెన్ అయితే బాగుంటుందనే ఆలోచన చేసిన్నట్టున్నారు. అయితే అదేదో వీలైనంత తొందరగా చేయమని కోరుతున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.

This post was last modified on December 4, 2022 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago