అడివి శేష్ ఇప్పుడు మామూలు ఉత్సాహంలో లేడు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో వరుసగా హిట్లు కొడుతున్న అతడికి.. ‘హిట్-2’ మరో ఘనవిజయాన్ని అందించేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా పబ్లిసిటీ కూడా కూడా బాగా ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం రూ.11 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. శేష్ కెరీర్లో ‘హిట్-2’ తెలుగు వరకు బిగ్గెస్ట్ హిట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
‘హిట్-2’ను త్వరలోనే హిందీ, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. అక్కడా సక్సెస్ అయితే ‘మేజర్’ కలెక్షన్లను కూడా దాటేస్తుందేమో. ‘హిట్-2’కు సూపర్ రెస్పాన్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు శేష్.
ఈ సందర్భంగా ‘హిట్-2’ సక్సెస్ గురించి మహేష్ బాబు తనతో మాట్లాడిన సంగతి వెల్లడించాడు శేష్. ‘‘రిలీజ్ రోజు ఉదయం మహేష్ గారు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. నా విషయంలో చాలా ప్రౌడ్గా ఉన్నానని చెప్పారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఒక సోదరుడిగా నాకు ఎప్పటికీ తోడుగా ఉంటానని ఆయనకు మాటిచ్చా. ఆయనకు ‘హిట్-2’ చూపించాలని ఆశగా ఉన్నా’’ అని శేష్ తెలిపాడు. ‘హిట్’ తర్వాతి సినిమాలో మహేష్ బాబును హీరోగా పెట్టండని ఒక అభిమాని అనగా.. ఆయనకు ఈ సినిమా సూటవుతుందో లేదో ఆలోచించాలని చెప్పాడు శేష్.
‘హిట్-2’ సక్సెస్ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడిగితే.. ‘‘నేను, నాని, విశ్వక్సేన్, శైలేష్ కలిసి ‘హట్వర్స్’లో తర్వాత ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే టీం అంతా కలిసి డ్యాన్స్ చేశాం’ అన్నాడు శేష్. ‘హిట్-2’ను ఈ నెల చివర్లో హిందీలో రిలీజ్ చేద్దామనుకుంటున్నామని.. అక్కడ తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటానని.. ‘మేజర్’ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతనన్నాడు.
This post was last modified on December 4, 2022 10:38 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…