Movie News

అడిగినోళ్ళకి చెయ్యట్లేదు.. కోరుకున్నోళ్ళు రావట్లేదు

మొండితనం.. దీనికో లిమిట్ ఉంటేనే బాగుంటుంది. మరీ ఓవర్ గా వెళిపోయినా కూడా గట్టిగా ఎదురుదెబ్బ తగిలే ఛాన్సుంటుంది. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ పరిస్థితి కూడా దీనికి దగ్గరగానే ఉందంటున్నారు సన్నిహితులు. డబ్బులు ఎంతపోయినా కూడా ఏదో ఒక కమర్షియల్ సినిమాతో పూరి చాలాసార్లు గట్టెక్కేశాడు. అయితే ఇప్పుడు కెరియర్ ప్రశ్నార్ధకంలో పడుతున్న టైములో మాత్రం.. ఇంకా మొండిగానే ఉంటానంటున్నాడు. పదండి ఆ కథాకమామీషూ ఏంటో చూద్దాం.

నిజానికి లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. మినిమం గ్యారంటీ సినిమా అయినా అవుతుందిలే అనుకున్నారంతా. కాని పూరి జగన్ మాత్రం, సెకండాఫ్‌‌ను ఒక రకంగా తీసి, ఆడియన్స్‌ను హింసించేశాడు. అయినాసరే పూరి జగన్‌తో కలసి పనిచేయడానికి చాలామంది స్టార్ హీరోస్ రెడీగానే ఉన్నారు. ఒక లైవ్ చాట్‌లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కథ తీసుకురమ్మని చెప్పారు. అయితే ఇలా ఆయన్ను అడిగినోళ్ళకి ప్రస్తుతం సినిమా చేసే ప్లాన్‌లో లేడంట మన పోకిరి డైరక్టర్. ఒక ప్యాన్ ఇండియా సినిమా తీసి ఫ్లాప్ అయ్యాడు కాబట్టి, మరో ప్యాన్ ఇండియా సినిమాతో హిట్టు కొట్టేసి తన సత్తాచాటాలని చూస్తున్నాడట. అందుకే బాలీవుడ్‌లో మకాం వేసి.. అక్కడ సల్మాన్ ఖాన్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోల కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో తెలుగులో హిట్టయిన సినిమాలు రీమేక్ చేస్తే బాలీవుడ్ ఆడట్లేదు. అలాగే అక్కడే సినిమాలు తీసిన క్రిష్‌, గౌతమ్ తిన్ననూరి వంటి తెలుగు డైరక్టర్లు కూడా పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయారు. మొన్ననే విక్రమ్‌వేద సినిమాను మళ్ళీ తీసి తమిళ డైరక్టర్స్ కూడా ఫ్లాప్ అయ్యారు. ఈ సమయంలో పూరి జగన్ కథను నమ్మి ఆయనకు ఏ హీరో డేట్స్ ఇస్తాడనేది చూడాల్సిన విషయమే. కాకపోతే ఇప్పటివరకు ఆయన కోరుకున్న ఒక్క బాలీవుడ్ హీరో కూడా కథ వినడానికి సుముఖత చూపలేదని తెలుస్తోంది.

This post was last modified on November 19, 2022 8:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

32 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago